YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ దేశీయం

రోడ్ ప్రమాదం :హైదరాబాద్ నుంచి ఆగ్రాకు వెళ్తోన్న లారీ బోల్తా.. ఐదుగురు మృతి

రోడ్ ప్రమాదం :హైదరాబాద్ నుంచి ఆగ్రాకు వెళ్తోన్న లారీ బోల్తా.. ఐదుగురు మృతి

రోడ్ ప్రమాదం :హైదరాబాద్ నుంచి ఆగ్రాకు వెళ్తోన్న లారీ బోల్తా.. ఐదుగురు మృతి
హైదరాబాద్ నుంచి ఉత్తరప్రదేశ్‌కు మామిడికాయలతో వెళ్తున్న ఓ వాహనం మధ్యప్రదేశ్ వద్ద ప్రమాదానికి గురయ్యింది. ఈ ప్రమాదంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయినట్టు అధికారులు తెలిపారు.  మరో 11 మంది గాయపడ్డారు. ప్రమాదానికి గురయిన వాహనం హైదరాబాద్ నుంచి ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాకు మామిడికాయలతో వెళ్తున్నట్టు పోలీసులు తెలిపారు. ఈ వాహనంలో 18 మంది ఉన్నారని నర్సింగ్‌పూర్ జిల్లా కలెక్టర్ దీపక్ సక్సేనా తెలిపారు. అతివేగంగా వెళ్తున్న వాహనం పథా గ్రామం వద్ద శనివారం అర్ధరాత్రి సమయంలో అదుపుతప్పి బోల్తాపడిందని పేర్కొన్నారు

Related Posts