YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు తెలంగాణ

తాగుబోతు భర్తను హతమార్చిన భార్య

తాగుబోతు భర్తను హతమార్చిన భార్య

తాగుబోతు భర్తను హతమార్చిన భార్య
నాగర్ కర్నూలు మే 11
నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి మండలం  మంగనూరు లో దారుణం చోటుచేసుకుంది. వేధింపులు ఎక్కువ కావడంతో భార్య తాళికట్టిన భర్తను అత్యంత కిరాతకంగా హత్య చేసి ఆత్మహత్యగా  చిత్రీకరించింది. వివరాల్లోకి వెళితే మంగనూరు కు చెందిన గంజి శ్రీనివాసులు (50) తాగుడుకు బానిసై నిత్యం భార్యతో గొడవ పడి చిత్రహింసలకు గురి చేసే వాడు.  భర్త వేధింపులు తట్టుకోలేని భార్య  విసిగి వేసారి  భర్తను హత్య చేసేందుకు పథకం  వేసుకుంది.  రాత్రి  ఎవరూ లేని సమయంలో  తప్పతాగి ఆరు బయట నిద్రిస్తున్న భర్త శ్రీనివాస్  గొంతును  కత్తితో కొసివేసింది. ఎవ్వరికి అనుమానం రాకుండా మృతిని చేతిలో కత్తి పెట్టి ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించింది. ఈ సంఘటనపై స్థానికుల ఫిర్యాదు మేరకు  పోలీసులు  గ్రామానికి చేరుకొని విచారణ చేశారు. భార్యను అదుపులోకి తీసుకుని  విచారణ చేపట్టగా  అసలు విషయం ఒప్పుకుంది . దీంతో ఈ సంఘటనపై  కేసు నమోదు చేసుకొని విచారణ జరుపుతున్నారు .

Related Posts