ఆర్ఆర్ వెంకటాపురంలో ఉద్రిక్తత
విశాఖ మే 11
నగరంలోని ఆర్ఆర్ వెంకటాపురంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. అక్కడకు పర్యటనకు వచ్చిన మంత్రులను గ్రామస్తులు అడ్డుకున్నారు. తమ గ్రామాన్ని ప్రభుత్వం విస్మరించిందంటూ స్థానికులు ఆందోళనకు దిగారు. దీంతో మంత్రులు స్థానికులను సముదాయించారు. మంత్రి అవంతి మాట్లాడుతూ ప్రభుత్వం ఎవరినీ విస్మరించలేదని చెప్పారు. ఇక్కడ పర్మినెంట్గా హెల్త్ క్యాంప్ పెట్టమని ముఖ్యమంత్రి చెప్పారన్నారు. జిల్లా కలెక్టర్ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తారని చెప్పారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి చెప్పారు. మంత్రి బొత్స మాట్లాడుతూ రైల్వేకు చెందిన డ్రైవర్, కో పైలట్ ఇద్దరూ గ్యాస్ లీక్ ఘటనలో స్పృహ కోల్పోయినట్లు ఈనాడు పత్రికలో వచ్చిన వార్త అబద్దమని చెప్పారు. ఇదే వార్త ఇంకొక ఇంగ్లీషు పేపర్లో కూడా వచ్చిందని.. ఇలాంటి వార్తలను నమ్మవద్దని మంత్రి అన్నారు. ఇలాంటి వార్తలు రాయవద్దని ప్రతికలకు సూచించారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందన్నారు. తాము ఇక్కడే రెండుమూడు రోజులు ఉంటామని బొత్స చెప్పారు.