YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు దేశీయం

బీహార్ అమ్మాయిపై పశువుల మాదిరిగా...

బీహార్ అమ్మాయిపై పశువుల మాదిరిగా...

బీహార్ అమ్మాయిపై పశువుల మాదిరిగా...
పాట్నా, మే 11
లాక్‌డౌన్ సమయంలోనూ మహిళలపై అఘాయిత్యాలు ఆగడం లేదు. ఆడది కనిపిస్తే పశువుల్లా మీద పడి అత్యాచారానికి పాల్పడుతున్నారు. ప్రభుత్వాలు, చట్టాలు, పోలీసులు ఇవేమీ పట్టించుకోకుండా దారుణాలకు తెగబడుతున్నారు. లాక్‌డౌన్ తొలినాళ్లలో ఎలాంటి నేరాలు జరగకపోవడంతో అందరూ హర్షం వ్యక్తం చేశారు. అయితే రోజులు గడిచేకొద్ది కామాంధులు రెచ్చిపోతున్నారు. తాజాగా బీహార్‌లో 16ఏళ్ల బాలికపై ఐదుగురు కామాంధులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అంతటితో ఆగకుండా ఆ దారుణాన్ని సెల్‌ఫోన్లో వీడియో తీశారు. ఏప్రిల్ 24వ తేదీన ఈ ఘటన జరగ్గా.. దానికి సంబంధించిన వీడియోలు తాజాగా సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. ఆ కామాంధులు తనను, తన కుటుంబాన్ని నాశనం చేస్తామని బెదిరించడంతోనే తాను ఈ విషయాన్ని ఎవరికీ చెప్పలేదని పోలీసులకు చెప్పింది. బాలిక తల్లి ఫిర్యాదులో రంగంలోకి దిగిన పోలీసులు నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నలుగురిని అరెస్ట్ చేయగా.. ఓ నిందితుడు పరారీలో ఉన్నాడుబీహార్‌లోని దర్బంగా జిల్లాలోని ఓ మారుమూల గ్రామానికి చెందిన దంపతులకు 16ఏళ్ల కుమార్తె ఉంది. భర్త గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో కూలీగా పనిచేస్తున్నాడు. దీంతో ఆ మహిళ కుమార్తెతో కలిసి గ్రామంలోనే ఉంటోంది. పదో తరగతి చదువుతున్న బాలిక ఏప్రిల్ 24 రాత్రి ఏదో పనిమీద బయటకు వెళ్లి తిరిగి ఒంటరిగా ఇంటికి వెళ్తోంది. ఆమెను గమనించి ఇద్దరు యువకులు కొంతదూరం వెంబడించి సమీపంలోని మామిడితోటలోకి లాక్కెళ్లారు. మరో ముగ్గురికి ఫోన్ చేసి రప్పించారు. ఆ ఐదుగురు కామాంధులు కలిసి ఆమెను పైశాచికంగా అత్యాచారానికి పాల్పడ్డారు.తనను వదిలేయాలని బాలిక వేడుకున్నా ఆ కామాంధులు వినిపించుకోలేదు. పశువుల్లా కొన్ని గంటల పాటు ఆమెపై అఘాయిత్యానికి పాల్పడుతూ నరకం చూపించారు. బాధితురాలు ఈ విషయాన్ని ఎవరికైనా చెబుతుందన్న భయంతో ఆమెను చంపేయాలనుకున్నారు. అయితే తాను ఈ అఘాయిత్యం గురించి ఎవరికీ చెప్పనని, వదిలిపెట్టాలని ఆమె వేడుకోవడంతో హెచ్చరించి పంపేశారు. ఈ విషయం బయటకు పొక్కితే నీ కుటుంబాన్ని మొత్తం అంతం చేస్తామని నిందితులు బెదిరించారు. దీంతో బాధితురాలు ఇంటికి వెళ్లి దీని గురించి ఎవరికీ చెప్పకుండా తనలో తానే కుమిలి పోయింది.ఈ దారుణాన్ని ఆమె మరిచిపోతున్న సమయంలో అనూహ్యంగా దానికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. నిందితుల్లో ఒకడు ఆ వీడియోను ఫ్రెండ్‌కి పంపించగా అతడు దాన్ని సోషల్‌మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో ఆ వీడియో వైరల్‌గా మారింది. దాన్ని గమనించిన ‘సైబర్ సేనాని’ అనే గ్రూప్ సభ్యులు పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు బాలిక గ్రామానికి వెళ్లి విచారించగా అసలు నిజం చెప్పింది. దీంతో ఆమె తల్లి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సోషల్‌మీడియా సంస్థ ప్రతినిధులను సంప్రదించిన పోలీసులు బాధితురాలి రేప్ వీడియోలు, న్యూడ్ ఫోటోలను డిలీట్ చేయించారు.

Related Posts