లాక్డౌన్ పొడిగించాలని మోదీకి సూచించిన మెజార్టీ సీఎంలు
న్యూఢిల్లీ మే 11
కరోనా కట్టడి చర్యల్లో భాగంగా కొనసాగుతోన్న లాక్డౌన్ను పొడిగించాలని వివిధ రాష్ట్రాల సీఎంలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సూచించారు. రాష్ట్రాల సీఎంలతో ప్రధాని ఐదోసారి వీడియో కాన్ఫరెన్స్ కొనసాగిస్తున్నారు. కాన్ఫరెన్స్లో పాల్గొన్న మెజార్టీ సీఎంలు లాక్డౌన్ పొడిగించాలని సూచించారు. బీహార్ సీఎం నితీశ్ కుమార్, తెలంగాణ సీఎం కేసీఆర్, బీహార్ సీఎం నితీశ్ కుమార్ ఇప్పటికే తమ వైఖరిని స్పష్టం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా కట్టడికి లాక్డౌన్ తప్ప మరో మార్గం లేదన్నారు. ఇతర రాష్ట్రాల సీఎంలు కూడా లాక్డౌన్ పొడిగింపును కోరుకుంటున్నారు. తెలంగాణలో ఇప్పటికే ఈ నెల 29 వరకూ లాక్డౌన్ పొడిగించారు. పంజాబ్, మహారాష్ట్రతో పాటు అనేక రాష్ట్రాలు నెలాఖరు వరకూ లాక్డౌన్ పొడిగించాయి. వాస్తవానికి ప్రస్తుతం కొనసాగుతున్న లాక్డౌన్ మూడోదశ ఈ నెల 17న ముగియనుంది. అయితే మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, ఢిల్లీలో కరోనా కేసుల తీవ్రత ఎక్కువగా ఉంది. రోజురోజుకూ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో కేంద్రం నెలాఖరు వరకూ లాక్డౌన్ పొడిగించే అవకాశం ఉంది. నేడో, రేపో కేంద్రం లాక్డౌన్-4 ప్రకటించవచ్చు.