కేసీఆర్, జగన్ మధ్య ఒప్పందం బయటపెట్టాలి:మర్రి డిమాండ్
హైదరాబాద్ మే 11
ఏపీ పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంచుతోందని కాంగ్రెస్ నేత మర్రిశశిధర్రెడ్డి ఆరోపించారు. దీనిపై సీఎం కేసీఆర్ స్పందించకపోవడం బాధాకరమన్నారు. వైఎస్ హయాంలో పోతిరెడ్డిపాడుపై కేసీఆర్ సెంటిమెంట్ రెచ్చగొట్టారని, పోతిరెడ్డిపాడుపై ఆయన వైఖరి చెప్పాలని డిమాండ్ చేశారు. 90 వేల క్యూసెక్కుల నీటిని తరలించే ప్రమాదం ఉందని, తాను, మాజీ ఎమ్మెల్యే పీజేఆర్ ఆనాడే ఆందోళన వ్యక్తం చేశామని గుర్తుచేశారు. కేసీఆర్, జగన్ మధ్య ఒప్పందం బయటపెట్టాలని మర్రిశశిధర్రెడ్డి డిమాండ్ చేశారు