YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విద్య-ఉపాధి ఆరోగ్యం దేశీయం

ఎంట్రన్స్ లేకుండా ఐఐటీ ప్రవేశం

ఎంట్రన్స్ లేకుండా ఐఐటీ ప్రవేశం

ఎంట్రన్స్ లేకుండా ఐఐటీ ప్రవేశం
ముంబై, మే 12
ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)-గాంధీ నగర్‌ ఒక విన్నూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. కరోన బారిన పడిన గ్రాడ్యుయేట్ల కోసం కొత్త ప్రోగ్రామ్‌ను రూపకల్పన చేసింది.కరోన నేపథ్యంలో స్కూళ్లు, కాలేజీలు, చదువులు ఎంత గందరగోళానికి గురయ్యాయో అందరికీ తెలిసిందే. వచ్చే విద్యా సంవత్సరం కూడా ఎంతో కొంత అయోమయానికి గురికాక తప్పని పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)-గాంధీ నగర్‌ ఒక విన్నూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. కరోన బారిన పడిన గ్రాడ్యుయేట్ల కోసం కొత్త ప్రోగ్రామ్‌ను రూపకల్పన చేసింది.ఏడాది కాలవ్యవధితో కూడిన పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ కోర్సులో కరోనా బారిన పడిన విద్యార్థులకు ఎలాంటి ప్రవేశ పరీక్షలు లేకుండా నేరుగా ప్రవేశం ఉంటుంది.. ఈ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ప్రోగ్రామ్ ప్రత్యేకంగా బయోలాజికల్ ఇంజనీరింగ్, కెమికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఎర్త్ సిస్టమ్స్ సైన్స్ వంటి విభాగాల్లో ఉంటుంది.ఈ కార్యక్రమం పూర్తి చేసిన విద్యార్థులు ఎంటెక్‌ ప్రోగ్రామ్‌లో లేటరల్‌ ఎంట్రీలో సీటు పొందగలుగుతారు. కరోనా మహమ్మారి కారణంగా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయాలనుకుని ఇబ్బంది పడిన విద్యార్థుల కోసం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు ఐఐటీ గాంధీనగర్‌ ప్రతినిధులు తెలిపారు. అలాగే ప్రత్యక్ష ప్రవేశ సౌకర్యం ఈ సంవత్సరానికి మాత్రమేమని స్పష్టం చేశారు.
కరోనా వైరస్‌ కట్టడిలో భాగంగా మార్చి 16 నుండి మొత్తం దేశంలోని విశ్వవిద్యాలయాలు, కాలేజీలు, స్కూళ్లు మూసివేసిన సంగతి తెలిసిందే. అనంతరం మార్చి 25న దేశం మొత్తం లాక్‌డౌన్‌ అమల్లోకి వచ్చింది. తరువాత దాన్ని మే 17 వరకు పొడిగించారు. కరోనా దేశంలో చాలా మంది ఉద్యోగాలను కోల్పోవడమే కాకుండా..విద్యార్థుల అకడమిక్ ఇయర్‌ను కూడా దెబ్బతీసింది. దీంతో ఐఐటీ-గాంధీ నగర్‌ తీసుకున్న నిర్ణయం విద్యార్థులకు ఊరట కలిగించే అంశం.

Related Posts