YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు వాణిజ్యం తెలంగాణ

లిక్కర్ షాపులతో నీరుగారిన లాక్ డౌన్ లక్ష్యం

లిక్కర్ షాపులతో నీరుగారిన లాక్ డౌన్ లక్ష్యం

లిక్కర్ షాపులతో నీరుగారిన లాక్ డౌన్ లక్ష్యం
ఎంపీ  రేవంత్ రెడ్డి
హైదరాబాద్ మే 12
కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి మరోసారి తెరాస ప్రభుత్వంపై మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడైతే లిక్కర్ ఓపెన్ చేశారో.. అప్పుడే కరోనా భయం పోయిందని అయన అన్నారు.  వైన్ షాపుల దగ్గర వందల మంది గుంపులుగా ఉన్నప్పుడు రాని కరోనా.. ఒక్కరిద్దరు పొట్టకూటి కోసం పని చేసుకునే మెకానిక్ షాప్స్ల ద్వారా వస్తుందా అని ప్రశ్నించారు. వైన్ షాపులకో న్యాయం.. చిన్న షాపులకో న్యాయమా అన్నారు. లాక్ డౌన్లో వేలకోట్ల బిజినెస్ను పోగొట్టుకొని వ్యాపారులు ప్రభుత్వానికి సహకరిస్తే .. వైన్స్ షాపులు తెరవడంతో సమస్య మళ్ళీ మొదటికి వచ్చిందన్నారు. 45 రోజుల వ్రతం కేసీఆర్ లిక్కర్ దుకాణాలు తెరవడంతో ఒక్క రోజుతో ఆగమాగం అయిందన్నారు.. దేశంలో మహారాష్ట్ర, గుజరాత్, అహ్మదాబాద్, ఏరియాల్లో ఎక్కువగా కేసులు పెరగడానికి కారణం నమస్తే ట్రంప్ సమావేశమేనన్నారు. మర్కజ్కి వెళ్ళింది 10వేల మంది మాత్రమేనని.. కానీ నమస్తే ట్రంప్ విూటింగ్కు లక్షల మంది అటెండ్ అయ్యారన్నారు. ప్రపంచ టూరిజమ్ ప్రాంతం అయిన గోవాలో కేసులు లేవు. కానీ గుజరాత్, మహారాష్ట్రలో కేసులు ఎక్కువని అన్నారు.

Related Posts