YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ దేశీయం

ముంబయి నుంచి వచ్చిన వ్యక్తికి పాజిటివ్

ముంబయి నుంచి వచ్చిన వ్యక్తికి పాజిటివ్

ముంబయి నుంచి వచ్చిన వ్యక్తికి పాజిటివ్
జగిత్యాల మే 12
జగిత్యాల జిల్లాలో మంగళవారం కొత్తగా మరో పాజిటివ్‌ కేసు నమోదైంది. ముంబయి నుంచి వచ్చిన వ్యక్తికి కొవిడ్‌ నిర్ధారణ అయినట్లు జిల్లా వైద్యాధికారి శ్రీధర్‌ తెలిపారు. ఇటీవల ముంబయి నుంచి పలువురు జిల్లాకు రాగా వారిని అధికారులు క్వారంటైన్‌లో ఉంచారు. వారిలో ఆరుగురు  అనుమానితుల శాంపిళ్లను పరీక్షించగా ఒకరికి పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు వైద్యాధికారి తెలిపారు. ఇప్పటికే జిల్లాలో నాలుగు పాజిటివ్‌ కేసులు ఉండగా అందులో ముగ్గురు కోలుకుని ఇళ్లకు చేరారు. ఒకరు గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇవాళ తాజాగా మరో కేసు నమోదు కావటం జిల్లా వాసుల్లో ఆందోళన కలిగిస్తోంది. 

Related Posts