YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

మడ ఆడవుల నరికివేతపై లోకేష్ మండిపాటు

మడ ఆడవుల నరికివేతపై లోకేష్ మండిపాటు

మడ ఆడవుల నరికివేతపై లోకేష్ మండిపాటు
హైదరాబాద్ మే 12
వైకాపా ప్రభుత్వంపై తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మండిపడ్డారు.  నిబంధనలకు విరుద్ధంగా కాకినాడ మడ అడవులను నరికివేస్తున్నారని ఆరోపించారు.  పర్యావరణాన్ని నాశనం చేస్తూ మత్స్యకారులకు జీవనాధారం లేకుండా చేస్తున్నారని విమర్శించారు.  కాకినాడకు తుపాను ముప్పు తెచ్చి పెడుతున్నారని అన్నారు.  చట్టాలను అతిక్రమించే పాలకులు ఉన్నప్పుడు ఎన్ని చట్టాలు చేసుకుంటే ఏంటి అని దుయ్యబట్టారు.   తన ట్విటర్ ఖాతాలో శాటిలైట్ ఫొటోలను జత చేశారు.

Related Posts