సంఖ్యలలో తేడాలున్నాయి
నల్లగొండ మే 12
నల్గోండ జిల్లా పెద్దవూర (మం) ఉట్లపల్లి గ్రామంలో బత్తాయి తోటలను బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ సోమవారం పరిశీలించారు. సంజయ్ మాట్లాడుతూ రైతుల సమస్యలు పరిష్కరించే చిత్తశుద్ధి కేసీఆర్ కి లేదు. రైతులు ధాన్యం తగలపెడ్తున్నా.. టీఆరెస్ ప్రభుత్వానికి పట్టట్లేదని విమర్శించారు. బత్తాయి రైతుల పరిస్థితి అధ్వాన్నంగా ఉంది. కేసీఆర్ క్వారంటైన్ సీఎం.. ఆరేళ్లుగా ప్రగతి భవన్ క్వారంటైన్ లోనే ఉన్నారు. నల్లగొండ బత్తాయి మార్కెట్ ఉన్నా వేస్ట్. కొత్తపేట ఫ్రూట్ మార్కెట్ ని కోహెడ తరలించిన రెండు రోజుల్లోనే గాలివానకు కూలిందని అన్నారు. పారాసిటమాల్ సీఎం కేసీఆర్. "ఐదో తేదీన ఏపీ ప్రభుత్వం పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంచేలా జీవో రిలీజ్ చేసినా.. టీఆరెస్ ప్రభుత్వానికి పట్టట్లేదని అన్నారు. ఏపీ సీఎం జగన్ తో ఉన్న చీకటి ఒప్పందం ఏంటో చెప్ఫాలని డిమాండ్ చేసారు. పాలమురు- నల్లగొండ- రంగారెడ్డి జిల్లాల రైతులతో పెద్దఎత్తున నిరాహార దీక్ష చేస్తాం. కరోనా టెస్టు విషయంలో.. టీఆరెస్ ప్రభుత్వ వైఖరి సరిగా లేదు. కేసుల సంఖ్య తక్కువగా చూపెట్టే ప్రయత్నమని అయన అన్నారు. హైదరాబాద్ లో పెరుగుతోన్న కేసుల సంఖ్యకు కేసీఆర్ సమాధానం చెప్పాలి. 26 తేదీన వృద్దుడు చనిపోతే.. రికార్డుల్లో చూపలేదు. ఇలా ఎన్ని ఉన్నాయో చెప్పాలని అయన అన్నారు.