ఐ యామ్ ఫైన్…
మంత్రి కేటీఆర్ ట్వీట్
హైదరాబాద్ మే 12
తాను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నానని రాష్ట్ర మంత్రి కేటీఆర్ ప్రకటించారు. తన ఆరోగ్యంపై ఆందోళన చెందొద్దని ట్విట్టర్ వేదికగా విజ్ఞప్తి చేశారు. సోమవారం నుంచి తన ఆరోగ్యంపై ఆందోళన చెందిన ప్రతి ఒక్కరికి అయన ధన్యవాదాలు తెలిపారు. తనకు ఎలాంటి ఇబ్బంది లేదని.. తాను బాగానే ఉన్నానన్నారు. సిరిసిల్లలో సోమవారం నాటి పర్యటన సందర్భంగా తనకు జలుబుకు సంబంధించిన ఎలర్జీ వచ్చిందన్నారు. కార్యక్రమాన్ని కొనసాగించాల్సి వచ్చిందన్నారు.