YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

తప్పుపట్టిన కాంగ్రెస్

తప్పుపట్టిన కాంగ్రెస్

తప్పుపట్టిన కాంగ్రెస్
హైద్రాబాద్, మే 12
శైలం ప్రాజెక్టు నుంచి కృష్ణా జలాలను తరలించడం కోసం కొత్త ఎత్తిపోతల పథకం నిర్మించాలని జగన్ సర్కారు నిర్ణయించడంతో తెలంగాణలో విపక్షాలు కేసీఆర్‌పై మండిపడుతున్నాయి. ఈ విషయమై కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి సీఎం కేసీఆర్‌ను టార్గెట్ చేసుకొని విమర్శలు గుప్పించారు. ఏపీ సీఎం జగన్ నీళ్లు తీసుకుపోతుంటే కేసీఆర్ చూస్తూ ఉన్నారని ఎద్దేవా చేశారు. తాను టీఆర్ఎస్‌లో ఉన్నప్పుడు నీటి ప్రాజెక్టులపై కేసీఆర్ బాగానే ఫోకస్ చేశారన్నారు. తన సూచన మేరకు లక్ష్మీదేవి పల్లి ప్రాజెక్టు కెపాసిటీని 10 టీఎంసీల నుంచి 20 టీఎంసీలకు పెంచారని విశ్వేశ్వర రెడ్డి తెలిపారు. లక్ష్మీదేవి పల్లి, అంతారం ప్రాజెక్టు నిర్మాణానికి గతంలో ప్రణాళికలు చేశారని కానీ అవి అటకెక్కాయన్నారు. వికారాబాద్ జిల్లాకు నీళ్లు ఇస్తే కేసీఆర్‌కి గుడి కట్టాలని అనుకున్నాం కానీ.. ఇక్కడ నీటి ప్రాజెక్టుల నిర్మాణం ముందుకు సాగకపోగా.. జగన్ నీళ్లు తీసుకెళ్తుంటే కేసీఆర్ చూస్తున్నారని కాంగ్రెస్ నేత ఆరోపించారు.పోతిరెడ్డిపాడు వల్ల టీఆర్ఎస్‌కు నష్టం వాటిల్లుతుందని తెలిసినా.. కేసీఆర్ మౌనంగా ఉన్నాడంటే ఏదో ఉండే ఉంటుందని విశ్వేశ్వర్ రెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. కేసీఆర్ సుప్రీంకోర్టు వెళ్తానని ప్రకటించడాన్ని స్వాగతిస్తున్నామన్నారు

Related Posts