ఏపీకి 512 టీఎంసీల వాటా ఎక్కడిది?: హరీష్రావు
హైదరాబాద్ మే 12 (
పోతిరెడ్డి పాడు, రాయలసీమ ఎత్తిపోతల పథకం తెలంగాణా ప్రయోజనాలకు విఘాతమని.. పునర్విభజన చట్టానికి వ్యతిరేకమని మంత్రి హరీష్రావు పేర్కొన్నారు. నేడు ఆయన మేడియా తోమాట్లాడుతూ.. వరద జలాలు తీసుకెళ్లే వారు అయితే 805 అడుగుల వద్ద లిఫ్ట్ ఎందుకని ప్రశ్నించారు. కేసీఆర్ ఉద్యమ నాయకుడుగా ఇచ్చిన పిలుపు మేరకు ఆరుగురు మంత్రులు రాజీనామా చేసిందే పోతిరెడ్డి పాడుకు వ్యతిరేకంగా అని స్పష్టం చేశారు. ఏపీకి 512 టీఎంసీల వాటా ఎక్కడిదని ప్రశ్నించారు. కృష్ణా జలాల్లో ఇంకా శాశ్వత కేటాయింపులే కాలేదని.. న్యాయ పోరాటం చేస్తామని హరీష్రావు పేర్కొన్నారు.