YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ ప్రయోజనాలను జగన్‌కు తాకట్టు పెడుతున్న కేసీఆర్

తెలంగాణ ప్రయోజనాలను జగన్‌కు తాకట్టు పెడుతున్న కేసీఆర్

తెలంగాణ ప్రయోజనాలను జగన్‌కు తాకట్టు పెడుతున్న కేసీఆర్
              టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం
హైదరాబాద్ మత్ 12
 రహస్య ఒప్పందం ప్రకారమే తెలంగాణ ప్రయోజనాలను కేసీఆర్.. జగన్‌కు తాకట్టు పెడుతున్నారని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం ఆరోపించారు. నేడు ఆయన ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ.. స్నేహ హస్తం ప్రజల మధ్య ఉండాలి కానీ నాయకుల మధ్య కాదన్నారు. ఆస్తులను కాపాడుకోవటం కోసమే కేసీఆర్, జగన్ స్నేహమని విమర్శించారు. కృష్ణా నది కింద ప్రాజక్టులను పూర్తి చేయకుండా కావాలనే కేసీఆర్ నిర్లక్ణ్యం చేశారన్నారు. ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 203పై ముఖ్యమంత్రి ఆలస్యంగా స్పందించారని కోదండరాం విమర్శించారు. ఉమ్మడి మిత్రడు మెఘా కృష్ణారెడ్డిపై ఉన్న ప్రేమ కేసీఆర్‌కు ప్రజలపై లేదన్నారు. ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 203తో తెలంగాణ రైతులకు తీరని నష్టం కలిగిందని.. తెలంగాణ రైతులను కేసీఆర్ మోసం చేశారన్నారు. రైతులకు అన్యాయం జరగనివ్వబోమని... రైతుల పక్షాన పోరాటం చేస్తామని కోదండరాం తెలిపారు.

Related Posts