YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం వాణిజ్యం దేశీయం

లాక్ డౌన్ 4.0 దిశగా అడుగులు

లాక్ డౌన్ 4.0 దిశగా అడుగులు

లాక్ డౌన్ 4.0 దిశగా అడుగులు
విజయవాడ, మే 13,
మార్చి 25 నుంచి దేశం మొత్తం లాక్‌డౌన్‌లో ఉంది. తొలి దశలో 21 రోజులపాటు లాక్‌డౌన్ ప్రకటించిన ప్రధాని మోదీ తర్వాత మరో రెండుసార్లు లాక్‌డౌన్ పొడిగించారు. తొలి దశ లాక్‌డౌన్‌లో వ్యవసాయానికి సంబంధించిన కార్యకలాపాలకు అనుమతి ఇవ్వగా.. లాక్‌డౌన్ మూడోదశలో గ్రీన్, ఆరెంజ్ జోన్లలో భారీగా సడలింపులు ఇచ్చారు. లాక్‌డౌన్ నాలుగో దశలో ఆరోగ్యంతోపాటు ఆర్థికానికి కూడా ప్రాధాన్యం ఇస్తూ.. మరిన్ని రంగాలకు సడలింపులు ఇచ్చే అవకాశం ఉంది. లాక్‌డౌన్ 4.0 నిబంధనలు, మార్గదర్శకాల గురించి కేంద్రం మే 17న పూర్తి వివరాలను వెల్లడించే అవకాశం ఉంది. దేశం కోసం 20 లక్షల కోట్ల రూపాయల ఆర్థిక ప్యాకేజీని ప్రధాని మోదీ ప్రకటించారు. ఈ ప్యాకేజీ విలువ దేశ జీడీపీ దాదాపు 10శాతం ఉంటుంది. ఆత్మ నిర్భర్ భారత్‌కు కావాల్సిన ఆర్ధిక దన్ను ఈ ప్యాకేజీ అందిస్తుంది. కరోనాపై పోరులో నాలుగునెలలకు పైగా సమయం గడిచిపోయింది.. భారత్‌లో కూడా అనేకమంది అయినవారిని కోల్పోయారు.  ఒకేఒక్క వైరస్‌ ప్రపంచాన్ని తలకిందులు చేసిందన్నారు.  ప్రపంచం మొత్తం సంక్షోభంలో ఉంది. మనం మరింత నిబ్బరంగా ఉండాలి’’. ‘‘ఆత్మనిబ్బర భారత్‌ సంకల్పాన్ని ప్రతి ఒక్కరూ తీసుకోవాలి. ప్రపంచవ్యాప్తంగా 42 లక్షలమందికిపైగా కరోనా బాధితులు ఉన్నారు. ఈ వైరస్‌ కారణంగా 2.75 లక్షలమందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. భారత్‌లో కూడా చాలామంది అయినవారిని కోల్పోయారు. వారందరికీ నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.దేశం కోసం 20 లక్షల కోట్ల రూపాయల ఆర్థిక ప్యాకేజీని ప్రధాని మోదీ ప్రకటించారు. ఈ ప్యాకేజీ విలువ దేశ జీడీపీ దాదాపు 10శాతం ఉంటుంది. ఆత్మ నిర్భర్ భారత్‌కు కావాల్సిన ఆర్ధిక దన్ను ఈ ప్యాకేజీ అందిస్తుంది. లాక్ డౌన్ 4.O వుంటుందని కొత్త నిబంధనలు అమలుచేస్తామన్నారు ప్రధాని మోడీ. అరగంట పాటు ప్రసంగించిన మోడీ కీలకమయిన ప్రకటనలు చేశారు. మేడిన్ ఇండియా ప్రొడక్ట్ లు ప్రోత్సహించాలని దేశీయ ఉత్పత్తులను వాడాలన్నారు మోడీ. ఇవాళ మనం తీసుకుంటున్న చర్యలకు  ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు వస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ఆర్థిక ప్యాకేజీ ద్వారా ఊతం అందిస్తామన్నారు. దేశంలో ప్రతి పారిశ్రామికుడిని కలుపుకొని పోయేలా ఈ ప్యాకేజీ ఉంటుందని చెప్పారు. భారత పారిశ్రామిక రంగానికి మరింత బలాన్ని చేకూర్చేలా ఈ ప్యాకేజీ ఉపయోగపడుతుందని చెప్పారు. మేకిన్‌ ఇండియా కార్యక్రమానికి ఈ ప్యాకేజీ మరింత బలాన్ని చేకూరుస్తుంది.. ఈనెల 18 నుంచి కొత్త లాక్ డౌన్ నిబంధనలు అమలులోకి వస్తాయన్నారు. కరోనా వైరస్ మానవజాతికి ఇది ఊహాతీతమని.. అలసిపోవద్దు, ఓడిపోవద్దు, కుంగిపోవద్దు, పోరాటంతోనే ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ సంక్షోభం కంటే మన సంకల్పం గొప్పది అన్నారు.భారత సంస్కృతి, సాంప్రదాయం మన స్వయం సంవృద్ది గురించి చెబుతాయన్నారు మోడీ. మొత్తం ప్రపంచాన్ని కుటుంబంగా చూసే సంస్కృతి మనది. ఈ భూమిని తల్లిగా భావించే ఆలోచన ఈ దేశానిది. అలాంటి మన దేశం స్వయం సంవృద్ది వైపు సాగితే. దీని ప్రభావం మొత్తం ప్రపంచానికి శుభపరిణామం అన్నారు. సోమవారం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మోదీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ప్రధాని దృష్టికి సీఎంలు అనేక సమస్యలను తీసుకువచ్చారు. ఇక లాక్‌డౌన్‌ ప్రకటించినప్పటి నుంచి ప్రధాని జాతినుద్దేశించి ప్రసంగించడం ఇది మూడోసారి. ఇక నాలువసారి లాక్ డౌన్ ఎలా వుంటుందోనని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Related Posts