YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ ప్రజల అవసరార్థం కొన్ని ప్రత్యేక రైళ్లను నడుపడానికి నిర్ణయం

కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ ప్రజల అవసరార్థం కొన్ని ప్రత్యేక రైళ్లను నడుపడానికి నిర్ణయం

కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ ప్రజల అవసరార్థం కొన్ని ప్రత్యేక రైళ్లను నడుపడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ మరియు కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ ద్వారా సూచించబడిన విధి విధానాలు.*

*ఈ ప్రత్యేక రైళ్లలో ప్రయాణించుటకు గాను  రిజర్వేషన్ కు  సంబంధించిన వివరాలు* ఈ ప్రత్యేక రైళ్లు లో  కేవలం  రిజర్వేషన్ చేసుకున్న వ్యక్తులను మాత్రమే అనుమతిస్తారు. ప్రత్యేక రైలు బయలు దేరే స్థానం నుండి  గమ్య స్థానం చేరే  ప్రయాణ మార్గమధ్యంలో ఎదురయ్యే స్టేషన్లలో మాత్రమే రిజర్వేషన్ బుకింగ్ కౌంటర్లు తెరవబడతాయి మరియు ఆ కౌంటర్ల వద్ద  ఈ కింద ఉదహరించిన వారికి మాత్రమే రిజర్వేషన్ సౌకర్యం కల్పిస్తారు. ఉన్నతాధికారులచే అభ్యర్ధన అనుమతి పొందిన  అత్యవసర నిమిత్తం ప్రయాణించే HOR ప్రయాణికులు, కేంద్ర ప్రభుత్వ మంత్రులు, గౌరవనీయమైన సుప్రీంకోర్టు మరియు వివిధ రాష్ట్రాల హైకోర్టుల న్యాయమూర్తులు, పార్లమెంటు సభ్యులు మరియు సంబంధించిన జాబితా లో గల వ్యక్తులు. ప్రస్తుత మరియు మాజీ MP లు, MLA లు మరియు  MLC లు. స్వాతంత్ర్య సమరయోధులు ఛార్జీలు ముందుగానే చెల్లించబడే  లేదా తరువాత తిరిగి పూర్తిగా చెల్లించబడే  వారెంట్లు మరియు  ఓచర్లు సంబంధిత  పత్రాలు సమర్పించడం ద్వారా చార్జీలో  మినహాయింపు కోరే ప్రయాణికులు. రైల్వే సిబ్బందికి సంబంధించిన ఉచిత ప్రయాణ టికెట్లు, సామాన్య మరియు డ్యూటీ పాస్ లకు సంబంధించి టికెట్లు.జనరల్ కోటా కు సంబంధించి రిజర్వేషన్ కేవలం IRCTC వెబ్ సైట్ లేదా యాప్ ద్వారా మాత్రమే రిజర్వేషన్ చేసుకోవలసి ఉంటుంది. ఈ ప్రత్యేక రైళ్ల యందు టికెట్ రిజర్వేషన్ అనేది రెగ్యులర్ గా నడిచే రైళ్ల కు ఉన్న నియమ నిబంధనలతో పాటు  క్రింద పేర్కొనినవి  తప్ప  మరి ఏ ఇతర  రిజర్వేషన్ కోటా లు  ఈ ప్రత్యేక రైళ్లలో అనుమతించబడవు. రైల్వే నిబంధనలు అనుసరించి 3AC కోచ్  నందు 2 బెర్తులను దివ్యాంగులకు కేటాయించడం జరుగుతుంది. ప్రస్తుతం కేంద్ర రైల్వే శాఖ సూచించిన సూచనలకు అనుగుణంగా రైలు తో పాటు ప్రయాణించి విధులు నిర్వహించే సిబ్బంది వసతికి అనుగుణంగా బెర్తుల కోటా రిజర్వు చేయబడతాయి. అత్యున్నత అధికారులచే రికమెండ్ చేయబడిన అత్యవసర ప్రయాణికులు, ప్రస్తుత మరియు మాజీ పార్లమెంట్ సభ్యులకు సంబంధించి 1AC నందు  2 బెర్తులు మరియు 2AC నందు 4 బెర్తులు  రిజర్వేషన్ కోట కేటాయిస్తారు. విధులకు హాజరు కాబోయే రైల్వే సిబ్బందికి సంబంధించి డ్యూటి పాస్ కోట కింద  1AC లో 2 బెర్తులు, 2AC లో 4 బెర్తులు మరియు 3AC లో 12 బెర్తులు  రిజర్వేషన్ కల్పిస్తారు. రైలు బయలుదేరు సమయానికి ముందు  రిజర్వేషన్ చార్టులను తయారుచేసే సమయంలో సంబంధిత కోటాలలో మిగిలిపోయిన బెర్తులను  అవసరపడిన తదుపరి రిమోట్ స్టేషన్ కు  బదిలీ చేయబడతాయి. ఈ రైళ్లు పూర్తిగా టికెట్ రిజర్వ్ చేయబడిన వ్యక్తులతో ప్రయాణించే రైళ్లు కాబట్టి టికెట్ తనిఖీ చేయు సిబ్బంది సంఖ్యను సమీక్షించి తక్కువ మందికి విధులు కేటాయిస్తారు మరియు విధులు నిర్వహించే సిబ్బందికి సురక్షిత చర్యలలో భాగం గా మాస్క్ లను హాండ్ శానిటైజర్లను అందచేస్తారు. *నిర్దేశించ బడ్డ  ప్రామాణిక సురక్షిత పద్దతుల ద్వారా ప్రత్యేక రైళ్లలో ప్రయాణించే వ్యక్తులను  సురక్షితముగా    తరలించడం.* ఎప్పటికప్పుడు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మరియు కేంద్ర హోమ్ శాఖలతో  సంప్రదింపులు జరుపుతూ వారు సూచించే  సలహాలు సూచనలు  అనుసరించి  కేంద్ర రైల్వే శాఖ ద్వారా ఈ ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేయడం జరుగుతుంది. రైలు బయలుదేరు మరియు గమ్య స్థానం కి సంబంధించిన సమయాలు, టికెట్లు బుక్ చేయు విధానాలు, ప్రయాణికులు  రైల్వే స్టేషన్ లోకి ప్రవేశించడం  స్టేషన్ లో కదలికలు, కోచ్ లో లభించే సేవలు గురించి రైల్వే శాఖ ద్వారా విస్తృతంగా ప్రచారం కల్పించడం. సరైన ప్రయాణ టికెట్లు తో  ప్రయాణించే వ్యక్తులను మాత్రమే స్టేషన్ లోకి అనుమతించడం జరుగుతుంది. ప్రయాణించే వ్యక్తికి  సంబంధించి  రైల్వే స్టేషన్  వరకూ రాకపోకల రవాణాకు గాను  ఉపయోగించే వాహనాన్ని అనుమతించుటకు గాను  నిర్ధారించబడిన e-ticket ఉంటేనే అనుమతి ఇస్తారు. కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ ప్రత్యేక రైలు నడుపు స్టేషన్ లో ఈ కింది చర్యలు చేపడుతుంది. ఈ ప్రత్యేక రైలు లో ప్రయాణించే ప్రతి వ్యక్తులను రోగ లక్షణాలు కొరకు స్క్రీనింగ్ చేయబడతారు. ఎటువంటి రోగలక్షణాలు లేని  వ్యక్తులను మాత్రమే ప్రయాణించే రైలు లోకి అనుమతించబడతారు. ప్రయాణం చేసే ప్రతి వ్యక్తికి స్టేషన్ ప్రవేశ ద్వారం మరియు నిర్గమ ద్వారం వద్దే కాకుండా కోచ్ ప్రవేశ ద్వారం మరియు నిర్గమ  ద్వారం వద్ద హాండ్ శానిటైజర్లను సమకూర్చడం జరుగుతుంది.  ప్రయాణికులందరూ స్టేషన్ లోకి ప్రవేశించూ మొదలు    ప్రయాణ పూర్తి అయ్యే వరకూ ముఖానికి సరైన మాస్కు ధరించాలి.ప్రయాణ సమయం లో ప్రయాణికులందరూ తమ తోటి ప్రయాణికుల  మధ్య సరైన దూరం ఉండేలా పాటించాలి. ఆరోగ్య సలహాలు సూచనల సమాచారం సిబ్బందికి మరియు ప్రయాణికులకు తగిన విధంగా చేరేలా కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ చర్యలు చేపట్టాలి. ప్రయాణికులు గమ్య స్థానం చేరాక సంబంధిత రాష్ట్రం సూచించిన ఆరోగ్య సూత్రాలను తప్పక  పాటించాలి. మొదటి రైలు బెంగళూరు నుండి ఢిల్లీకి బయలుదేరి ఉదయం అర్ధరాత్రి తరువాత అనంతపురం 130 నిమిషాలకు గుంతకల్ స్టేషన్లలో ఆగి సికింద్రాబాదు మీదుగా ఢిల్లీకి బయలుదేరడం జరిగింది.. అందులో అనంతపురం కు 42 మంది గుంతకల్ కు 15 మంది దిగడం జరిగింది. తగిన జాగ్రత్తలు పాటిస్తూ రైలు ప్రయాణం సుఖమయం చేసుకోవాలని ప్రభుత్వం వారు సూచిస్తున్నారు. 

డాక్టర్ అర్జా శ్రీకాంత్
స్టేట్ నోడల్ ఆఫీసర్ Covid 19*

Related Posts