YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

రైళ్లు సిద్దం.. అనుమతే తరువాయి

రైళ్లు సిద్దం.. అనుమతే తరువాయి

రైళ్లు సిద్దం.. అనుమతే తరువాయి
హైదరాబాద్ మే 13
కేంద్రం ఇచ్చిన సడలింపుల మేరకు రైల్వేశాఖ తిరిగి రైళ్లను ప్రారంభించింది..లాక్ డౌన్ నేపద్యంలో గత 50 రోజులుగా రైళ్లు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి..సుదీర్ఘ విరామం తర్వాత కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సడలింపు లలో భాగంగా రైల్వేశాఖ ప్రత్యేకంగా కొన్ని రైళ్లను నడిపెందుకు సిద్ధమైంది...అందులో భాగంగా బెంగళూరు నుండి న్యూఢిల్లీ వరకు సికింద్రాబాద్ మీదుగా వెళ్లే రాజధాని ఎక్స్ప్రెస్ నేడు పట్టాలెక్కింది..బెంగళూరు నుండి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ చేరుకున్న అనంతరం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో 288 ప్రయాణికులు రాజధాని ఎక్స్ప్రెస్ లో వెళ్లారు...ప్రతి ప్రయాణికుడు ధర్మల్ స్క్రీనింగ్ నిర్వహించిన అనంతరం వారిని స్టేషన్ లోపలికి అనుమతిస్తారు..పటిష్ట బందోబస్తు నడుమ రైళ్లను నడుపుతున్నారు..రైళ్లలో కూడా భౌతిక దూరం పాటిస్తూ కూర్చునే విధంగా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు

Related Posts