సీమకు నీళ్లు ఇవ్వాలి
గుంటూరు మే 13,
గుంటూరు రెడ్డిపాలెంలోని క్వారంటైన్ సెంటర్ ను బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ బుధవారం పరిశీలించారు. మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు తో కలసి అయన బాధితులను పరామర్శించారు. కన్నా మాట్లాడుతూ ఈ సెంటర్ లో 120 మంది ఉన్నారు. సెంటర్ లో బాధితులు బాగానే ఉన్నారని అన్నారు. శ్రీశైలంలోని మిగులు జలాలను పోతిరెడ్డిపాడు ద్వారా తీసుకునే అవకాశం ఉంది. రాయలసీమ కు నీళ్ళు ఇవ్వాలన్నదే మా ఉద్దేశం. తెలంగాణ తో ఏపి ప్రభుత్వం న్యాయ పోరాటం చేస్తారో ఏమీ చేస్తారో తెలియదని అన్నారు. రాయలసీమ వారికి మాత్రం ప్రభుత్వం వెనక్కి తగ్గకుండా నీళ్ళు ఇవ్వాలి. రాయలసీమకు నీళ్ళు ఇవ్వాలని గతంలో బిజెపి పోరాటాలు చేసిందని కన్నా అన్నారు.