YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

జమ్మలమడుగు ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలి

జమ్మలమడుగు ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలి

జమ్మలమడుగు ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలి
కడప మే 13
లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన జమ్మలమడుగు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పై చర్యలు తీసుకోవాలని టీడీపీ నేతలు డిమాండ్ చేసారు. ఈ మేరకు టీడీపీ నాయకులు హరిప్రసాద్,గోవర్ధన్ రెడ్డి బుధవారం జిల్లా ఎస్పీ కి వినతి పత్రాన్ని అందజేసారు.  కడప జిల్లాలో కరోనా నివారణ కోసం పోలిసులు, వైద్యులు,పారిశుధ్య కార్మికులు అహర్నిశలు పనిచేస్తున్నారు. జమ్మలమడుగు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ముద్దనూరు లో దాదాపు 10 ట్రాక్టర్ లలో వెళ్లి కూరగాయలు పంపిణీ చేశారు. వైసీపీ నాయకులు లాక్ డౌన్ ఉల్లంఘనలు చేస్తున్నారు.వైసీపీ ఎమ్మెల్యేలు కరోనా ను వ్యాప్తి చేస్తున్నారు. మద్యం మీద ఉన్న ఆసక్తి ప్రభుత్వానికి కరోనా కట్టడి లో లేదు. జమ్మలమడుగు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గుంపులుగా వెళ్లి ప్రచార ఆర్భాటాలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి టీడీపీ నాయకుల వల్ల కరోనా వస్తుందని చెప్తున్నారు.  ప్రజలు బయటికి రాకుండా ఉండాలి కానీ వైసీపీ నాయకులు మాత్రం గుంపులు గుంపులుగా తిరుగుతున్నారని అన్నారు. మద్యం అమ్మకాల పై ఉన్న ప్రేమ ప్రజల పై సీఎం కు లేదు. ఏపీ లో చీప్ లిక్కర్ అమ్ముతున్నారని అన్నారు.

Related Posts