YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

ఒడిసా కు బయలుదేరిన ప్రత్యేక శ్రామిక్ రైలు

ఒడిసా కు బయలుదేరిన ప్రత్యేక శ్రామిక్ రైలు

ఒడిసా కు బయలుదేరిన ప్రత్యేక శ్రామిక్ రైలు
సొంత రాష్ట్రానికి వెళ్లే ఆనందం....            
 జిల్లా యం త్రాంగం నకు ధన్య వాదా లు తెలిపిన ఒడిసా వలస కార్మికులు
చిత్తూరు, ,13 
ఒడిసా రాష్ట్రం నుండి వివిధ పనులపై జిల్లాకు వచ్చి లాక్ డౌన్ కారణంగా ఇక్కడే ఉండి పోయిన వారిని రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రత్యేక శ్రామిక్ రైలు ద్వారా పంపడం జరిగిందని జిల్లా కలెక్టర్ డా.నారాయణ భరత్ గుప్త తెలిపారు.  ఒడిసా రాష్ట్రంనకు చెందిన వలస కార్మికులు, వివిధ పనుల నిమిత్తం జిల్లాకు వచ్చి లాక్ డౌన్ కారణంగా ఇక్కడే ఉండిపోయిన వారు వారి వివరాలను సంబంధిత తహశీల్దార్లు కు అందించగా స్పందన వెబ్ సైట్ నందు వివరాలను అప్ లోడ్ చేయ డం జరిగిందని, వారందరికీ ఈ- పాస్ జనరేట్ కావడం జరిగిందని, రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు బుధవారం మధ్యాహ్నం ప్రత్యేక శ్రామిక్ రైలు ద్వారా ఒడిస్సా రాష్ట్రా నికి 1413 మందిని పంప డం జరిగిందని తెలిపారు. ఒడిసా రాష్ట్రం నకు వెళ్లే వారికి గత 3 రోజుల ముందుగానే  పరీక్షలు నిర్వహించడం జరిగిందని, మరలా నేడు చిత్తూరు రైల్వే స్టేషన్ లో థర్మల్ స్క్రీనింగ్ నిర్వహించి వారికి అవసర మైన భోజనం, త్రాగునీరు వారికి అందించడంతో      పాటు తగు జాగ్రత్తలు తీసు కుంటూ పంపడం జరిగింద ని తెలిపారు. ఈ ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ తో పాటు జెసి డి. మార్కం డేయులు, జిల్లా కోవిడ్ – 19 నోడల్ అధికారి చంద్ర మౌళి, చిత్తూరు ఆర్డిఓ రేణుక, కలెక్టరేట్ ఏఓ గోపాలయ్య, సంబంధిత మండల తహశీల్దార్లు, ఏర్పాట్లను పర్యవేక్షించారు. మ.3 గంటల కు ఒడిసా కు  బయలుదేరిన ప్రత్యేక శ్రామి క్ రైలు కు కరతాళ ధ్వనుల తో రైల్వే పోలీసులు, రెవెన్యూ అధికారులు వీడ్కోలు పలికారు.  సొంత రాష్ట్రానికి వెళ్లే ఆనం దం....తో పాటు ఒడిసా కు పంపేందుకు  రాష్ట్ర ప్రభు త్వం తో పాటు   జిల్లా యం త్రాంగం తీసుకొన్న చొరవ ను, వారికి అందించిన సౌక ర్యా లకు మరియు సహాయ సహకారాలకు ఒడిసా వలస కార్మికులు ఆనందం తో    ధన్య వాదాలు తెలిపారు

Related Posts