YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు దేశీయం

12 కోట్ల వలస కార్మికులపై కరోనా

12 కోట్ల వలస కార్మికులపై కరోనా

12 కోట్ల వలస కార్మికులపై కరోనా
న్యూఢిల్లీ, మే 14,
దేశ విభజన తర్వాత అతిపెద్ద ఉత్పాతం కరోనా వెలుగులో 12 కోట్ల మంది వలస కార్మికులపై విరుచుకుపడిందని, ఆదుకునే వారు లేరనే నిరాశతో లక్షలాది మంది వలస కూలీలు రైలు పట్టాలు, రోడ్లమీదుగా వందలాది మైళ్ల దూరం నడుచుకుంటూ తమ స్వస్థలాలకు బయలు దేరుతూ ప్రాణాలమీదికి తెచ్చుకుంటున్నారంటూ అంతర్జాతీయ పత్రికలు భారత్‌లో విషాదం గురించి పుంఖానుపుంఖాలుగా వ్యాసాలు ప్రచురిస్తున్నాయి. కానీ మన దేశంలో మాత్రం ఇతర రాష్ట్రాల్లో చిక్కుకుని 50 రోజులుగా పలకరించే దిక్కు లేక కాలినడకన వందలాది మైళ్లు నడిచి స్వస్థలాలకు వెళ్లడానికి సిద్ధమవుతున్న వలస కార్మికుల పట్ల కనీస మానవత్వాన్ని కూడా పాలకులు, పోలీసు యంత్రాంగం ప్రదర్శించలేదని పదే పదే రుజువవుతోంది.బెంగళూరులో తాజాగా స్వస్థలాలకు వెళ్లడానికి అనుమతి కావాలంటూ కేజీ హోలీ పోలీస్ట్‌ స్టేషన్‌కు వెళ్లిన కార్మికులపై స్థానిక అధికారి దుశ్చర్యకు పాల్పడ్డారు. కార్మికుడిపై చేయి చేసుకోవడమే కాకుండా బూటుకాలితో తన్ని పరిగెత్తించారు. ఇదీ దేశంలోని 12 కోట్లమంది వలస కార్మికుల వ్యథల పట్ల మన వ్యవస్థ ప్రదర్శిస్తున్న స్పందన.లాక్‌డౌన్‌ కారణంగా దేశంలో వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వలస కార్మికుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పలురైళ్లను నడుతున్నా.. అనుమతులు లభించక చాలామంది కార్మికులు పడిగాపులు గాస్తున్నారు. పాసుల కోసం వెళ్లగా పలుచోట్ల వలస కార్మికులపై పోలీసులు ప్రతాపం చూపిస్తున్నారు. తాము స్వస్థలాలకు వెళ్లడానికి అనుమతి కావాలంటూ బెంగుళూరులోని కేజీ హోలీ పోలీస్ట్‌ స్టేషన్‌కు వెళ్లిన కార్మికులపై స్థానిక అధికారి దుశ్చర్యకు పాల్పడ్డారు. కార్మికుడిపై చేయి చేసుకోవడమే కాకుండా బూటుకాలితో తన్ని పరిగెత్తించారు. ఈ వీడియోకాస్తా సోషల్‌ మీడియాలో వైరల్‌‌గా మారడంతో ఉన్నతాధికారులు స్పందించి అతన్ని విధుల్లోనుంచి తొలగించారు. ‘ఉత్తర ప్రదేశ్‌కి చెందిన కొంతమంది వలస కూలీలు స్థానిక పోలీస్‌‌ స్టేషన్‌కు వచ్చారు. తాము స్వస్థలాలకు వెళ్లేందుకు పాసులు మంజూరు చేయాల్సిందిగా కోరారు. ఈ క్రమంలోనే  ఏఎస్‌ఐ రాజా సాహెబ్‌ వారితో దుర్భాషలాడారు. అంతేకాకుండా చేయి చేసుకుని బూటుకాలితో తన్నారు. పై అధికారుల ఆదేశాల మేరకు  ఏఎస్‌ను సస్పెండ్‌ చేశాము’ అని వివరించారు.మరోవైపున వలస కూలీలు సొంత ఊళ్లకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నప్పుడు వారిని అడ్డుకోవద్దని, వారికి పూర్తి సహాయ సహకారాలు అందించాలని అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులను కేంద్ర హోంశాఖ కోరింది. ఈ మేరకు ఆ శాఖ కార్యదర్శి అజయ్‌ భల్లా సోమవారం లేఖ రాశారు. వలస కూలీలు సొంతూళ్లకు వెళ్లేందుకు సహకరించాలని అన్ని రాష్ట్రాల సీఎస్‌లకు రాసిన మరో లేఖలో కోరారు. వలస కూలీలను సొంతూళ్లకు చేర్చేందుకు అవసరమైన ప్రత్యేక శ్రామిక రైళ్లను ఏర్పాటు చేసేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటోంది. వారిని వారి ప్రాంతాలకు పంపేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సహకరించాలని హోంశాఖ కార్యదర్శి లేఖలో కోరారు. వలస కూలీలు రోడ్డు మార్గంలో, రైలు పట్టాలపై నడుచుకుంటూ వెళ్లకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. రైళ్లు, బస్సులు ఏర్పాటయ్యే వరకు వారికి వసతి, భోజన సౌకర్యాలు కల్పించాలని స్పష్టంగా తెలిపారు.కానీ వారికి వసతి, భోజన సౌకర్యం కల్పించడం మాటేమిటో కానీ పాసులిప్పించాలని పోలీసుస్టేషన్‌కు రావడమే నేరం అన్నట్లుగా పోలీసు అధికారి బూటుకాళ్లతో తన్నడం అధికార వ్యవస్థ స్పందనా రాహిత్యానికి ప్రతీకగా మిగిలిపోనుంది

Related Posts