YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

గుడులు క్లోస్, మద్యం షాపులు ఓపెన్..

గుడులు క్లోస్, మద్యం షాపులు ఓపెన్..

గుడులు క్లోస్, మద్యం షాపులు ఓపెన్..
హైద్రాబాద్, మే 14
కరోనా వైరస్ (కోవిడ్ 19) వ్యాప్తిని అడ్డుకునేందుకు కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలు చేస్తోంది. అయితే లాక్ డౌన్ సడలింపుల్లో భాగంగా గ్రీన్, ఆరంజ్ జోన్లలో మద్యం దుకాణాలకు అనుమతిచ్చింది. కానీ, అన్ని మతాలకు చెందిన మందిరాలను మాత్రం మూసివేయాల్సిందేనని స్పష్టం చేసింది. దీనిపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. క్రమశిక్షణ కలిగిన భక్తులు వచ్చే గుడులను మూసేసి.. మత్తులో తూలే లిక్కర్ షాపులను తీసేందుకు మాత్రం ఎలా అనుమతులిస్తారని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇందులో భాగంగాసీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు కె.నారాయణ గుడులు, వైన్ షాపుల మధ్య ప్రస్తుతం ఉన్న వ్యత్యాసాన్ని చూపించే ప్రయత్నం చేశారు.హైదరాబాద్ లిబర్టీలోని తిరుమల తిరుపతి దేవస్థానాన్ని (టీటీడీ) బుధవారం ఉదయం నారాయణ సందర్శించడానికి వచ్చారు. అక్కడ ఆలయం తలుపులు మూసి ఉండడంతో లోపలికి లేకపోయారు. ఆ తర్వాత ఆలయానికి సమీపంలో హిమాయత్ నగర్ మెయిన్ రోడ్‌లో ఉన్న కులదీప్ వైన్స్‌ను కూడా ఆయన సందర్శించారు. అక్కడ మాత్రం మందు దుకాణం తీసే ఉంది ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం క్రమశిక్షణ కలిగిన భక్తులు ఆలయానికి వచ్చి దేవుడిని దర్శించుకోవడానికి వ్యక్తిగత దూరం సమస్య అవుతుందని దైవదర్శనాలు రద్దు చేసిందని పేర్కొన్నారు. కానీ మద్యం దుకాణాలకు మాత్రం అనుమతిచ్చి, ఎక్కడైతే క్రమశిక్షణ ఉండదో అక్కడ లాక్ డౌన్ ఉల్లంఘించే విధంగా అనుమతులు మాత్రం ఇచ్చిందని నారాయణ విమర్శించారు. ఇన్ని రోజులు ప్రజలు క్రమశిక్షణగా ప్రభుత్వం విధించిన లాక్ డౌన్‌ను అనుసరిస్తూ ఉన్నారని చెప్పారు. అయితే ఇప్పుడు రెండు నెలలపాటు ప్రజలు పాటించిన నియమాన్ని వృథా చేసే విధంగా మోదీ ప్రభుత్వం మద్యం దుకాణాలకు మాత్రం అనుమతిచ్చిందని విమర్శించారు

Related Posts