YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం ఆంధ్ర ప్రదేశ్

18 నుంచి ఏపీ బస్సులు

18 నుంచి ఏపీ బస్సులు

18 నుంచి ఏపీ బస్సులు
విజయవాడ, మే 14,
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. ఆర్టీసీ బస్సులు తిప్పేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఈ నెల 18వ తేదీ నుంచే బస్సులు తిప్పేందుకు సన్నద్ధమవుతున్నారు. ఈ మేరకు ఆర్టీసీ రీజనల్ మేనేజర్లకు సర్క్యులర్ జారీ అయ్యాయి. కరోనా వైరస్ వ్యాప్తి చెంతుతున్న తరుణంలో ప్రయాణికుల మధ్య భౌతిక దూరం ఉండేలా ఆర్టీసీ చర్యలు చేపట్టింది. లాక్ డౌన్ నేపథ్యంలో ఏపీలో ఆర్టీసీ బస్సులన్నీ డిపోలకే పరిమితమైన విషయం తెలిసిందే.లాక్ డౌన్ కారణంగా మార్చి 22వ తేదీ నుంచి ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కలేదు. తాజాగా ప్రజా రవాణాకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సడలింపులు ఇవ్వడంతో.. ఆర్టీసీ బస్సులు తిప్పాలని అధికారులు నిర్ణయించారు. ఇందులో భాగంగా 18వ తేదీ కల్లా బస్సులను తిప్పేందుకు సిద్ధంగా ఉండాలని రాష్ట్రంలోని రీజనల్ మేనేజర్లకు ఆర్టీసీ ఎండీ మాదిరెడ్డి ప్రతాప్ సర్క్యులర్ జారీ చేశారు.ఆర్టీసీ ఎండీ ఆదేశాల నేపథ్యంలో రాష్ట్రంలోని అనంతపురం జిల్లా వరకు తొలి దశలో 635 బస్సులను తిప్పాలని అధికారులు నిర్ణయించారు. అలాగే ప్రయాణికుల మధ్య భౌతిక దూరం ఉండేలా సీట్లను అరేంజ్ చేస్తున్నారు. బస్సుల్లో 50 శాతం మంది మాత్రమే ప్రయాణించేలా చర్యలు చేపట్టారు. టికెట్లను కూడా ఆన్ లైన్ ద్వారా బుక్ చేసుకునేలా చర్యలు చేపడుతున్నారు. ఒకవేళ బస్సులో సీట్లు ఖాళీగా ఉంటే బస్టాండ్‌లోనే గూగుల్ పే, ఫోన్ పే, ఆన్ లైన్ ద్వారా కండక్టర్లు టికెట్లను బుక్ చేస్తారు.

Related Posts