చంద్రబాబుపై విజయసాయిరెడ్డి సెటైర్లు
విశాఖపట్నం మే 14,
టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి తనదైన శైలిలో సెటైర్లు వేశారు. 23 సీట్లతో చిత్తుగా ఓడి ఏడాది తిరగకముందే... చంద్రబాబు తన పరిపాలనను తానే మెచ్చుకోవడం వింతగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు.పోతిరెడ్డిపాడు జిఓపై తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టడానికి బాబు అను-కుల మీడియా కింద మీదా పడుతోందని విజయసాయిరెడ్డి విమర్శించారు. బాబు సిఎంగా లేని రాష్ట్రం ప్రశాంతంగా ఉండొద్దని కుతంత్రాలు పన్నుతోందని ఆరోపించారు.రాజకీయ పార్టీల కంటే ఎల్లో మీడియా ఎజెండానే అత్యంత క్రూరంగా, అన్నదమ్ములు ఒకరినొకరు చంపుకోవాలన్నట్టుగా ఉందని వ్యాఖ్యానించారు.ప్రకాశం బ్యారేజిలో 15 ఎకరాల కృత్రిమ ద్వీపం ఏర్పాటుకు డ్రెడ్జింగుకు అనుమతి ఇచ్చింది చంద్రబాబే అని విమర్శించారు. ఇప్పుడు మడ అడవుల పేరుతో పర్యావరణం ఖూనీ అని దొంగ ఏడుపులేడుస్తున్నారని మండిపడ్డారు.