ప్రధాని ఆలోచన తీరు అమోఘం
ఏలూరు మే 14
అగ్రరాజ్యాలకు పోటీగా భారతదేశంలో అత్యదికంగా ఆర్దిక ప్యాకేజీని ప్రకటించిన మోదీకి మాజీ మంత్రి మాణిక్యాల రావు అభినందనలు తెలిపారు.పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడంలో మీడియాతో మాట్లాడుతూ లక్షల మాస్కులతో పాటు పిపీఈ కిట్ల తయారీకి ప్రధాన్యత ఇస్తున్న కేంధ్ర ప్రభుత్వ చిత్తశుద్దిపై హర్షం వ్యక్తం చేశారు.మోదీ నిర్ణయాల వైపు ప్రపంచ దేశాలు చూస్తున్నాయని,ముఖ్యంగా కరోనా కష్టంల్లో చిక్కుకున్న సూక్ష్మ,చిన్నతరహా పరశ్రమలను ఆదుకునే దిశగా ప్రధాని మోదీ ఆలోచన తీరును అభినందించారు.దేశ చరిత్రలో అతి పెద్ద ఆర్ధిక ప్యాకేజి వల్ల సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ఈ ప్యాకేజీ ఆర్దికంగా ఆదుకుటుందని చెప్పారు.అనేక ఆర్ధిక రాయితీలను ప్రకటించడమే కాకుండా ఈపీఎఫ్ ను కూడా ప్రభుత్వమే చెల్లించేలా తీసుకున్న నిర్ణయం అభినందనీయమని చెప్పారు.