YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

కరోనా బాధితుడికి కుటుంబానికి లేకుండానే అంత్యక్రియులు

కరోనా బాధితుడికి కుటుంబానికి లేకుండానే  అంత్యక్రియులు

కరోనా బాధితుడికి కుటుంబానికి లేకుండానే  అంత్యక్రియులు
కోల్ కత్తా, మే 14,
కరోనా బారినపడ్డ ఓ వ్యక్తిని ఆస్పత్రిలో చేర్పించారు. 5 రోజుల తర్వాత కుటుంబసభ్యులు అతడి ఆరోగ్యం గురించి వాకబు చేయడానికి సదరు ఆస్పత్రికి ఫోన్ చేశారు. అవతలి నుంచి వచ్చిన సమాధానం విని షాక్‌కు గురయ్యారు. ఆ వ్యక్తి నాలుగు రోజుల కిందే చనిపోయాడని.. అంత్యక్రియలు కూడా పూర్తి చేశామని ఆస్పత్రి సిబ్బంది చెప్పడమే అందుక్కారణం. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో చోటు చేసుకున్న ఘటన అందరినీ షాక్‌కు గురిచేస్తోంది. కొవిడ్-19 రోగుల కోసం బెంగాల్ ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్రతిష్టాత్మక ఎంఆర్ బంగూర్ ఆస్పత్రిలో ఈ ఘటన చోటు చేసుకోవడం మరింత ఆశ్చర్యానికి గురిచేస్తోంది.కరోనా మహమ్మారి విలయతాండవానికి పరిస్థితులన్నీ తలకిందులవుతున్నాయి. దగ్గరి వాళ్లు, బంధువులు చనిపోతే కడచూపునకు కూడా నోచుకొని దుస్థితి నెలకొంది. లాక్‌డౌన్‌తో చిక్కుకున్న కొంత మంది తమ కుటుంబసభ్యులు మరణించినా అంత్యక్రియలకు హాజరు కాలేని సంఘటనలను మనం చూశాం. ఇక కొవిడ్-19 బారినపడి మరణించిన రోగులకైతే.. ప్రత్యేక పద్ధతుల్లో అంత్యక్రియలు పూర్తి చేస్తున్నారు. కుటుంబ సభ్యులు, దగ్గరి వాళ్లు ఓ నలుగురైదురికి మాత్రమే అంత్యక్రియల్లో పాల్గొనడానికి అవకాశం కల్పిస్తున్నారు. కానీ, కోల్‌కతాలో ప్రభుత్వ ఆస్పత్రి సిబ్బంది మాత్రం కుటుంబసభ్యులకే సమాచారం ఇవ్వకుండా కరోనా రోగి అంత్యక్రియలు పూర్తి చేసి వార్తల్లోకెక్కారు.కోల్‌కతా న‌గ‌రానికి చెందిన 70 ఏళ్ల హ‌రినాథ్ సేన్ అనే వ్యక్తికి ఏప్రిల్ 29న క‌రోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో అధికారులు ఆయణ్ని ఎంఆర్ బంగూర్ ప్రభుత్వ ఆసుపత్రికి త‌ర‌లించారు. హరినాథ్ భార్య, ఇద్దరు కుమారులు, కోడళ్లను క్వారంటైన్ కేంద్రంలో చేర్పించారు.మే 5న హరినాథ్ కుమారుడు అర్జిత్ సేన్ తన తండ్రి ఆరోగ్యం గురించి ఆస్పత్రికి కాల్ చేస్తే తమకు సమాచారం తెలియదని చెప్పి పెట్టేశారు. దీంతో అతడు మరుసటి రోజు మరోసారి కాల్ చేశాడు. ఈసారి ఫోన్ తీసిన వ్యక్తి హరినాథ్ నాలుగు రోజుల కిందటే మరణించారని, ద‌హ‌న సంస్కారాలు కూడా పూర్తి చేశాం అని బదులిచ్చాడు. ఆ వార్త విని క్వారంటైన్ కేంద్రంలో ఉన్న కుటుంబసభ్యులంతా షాక్‌కు గురయ్యారు. బాధితుడి చనిపోయిన నాలుగు రోజుల తర్వాత గానీ కుటుంబ సభ్యులకు ఆ విషయం గురించి తెలియలేదు.తన తండ్రి ఆరోగ్యం గురించి ఫోన్ చేస్తే.. ఆస్పత్రి సిబ్బంది తనతో దురుసుగా ప్రవర్తించారని అర్జిత్ సేన్ ఆరోపిస్తున్నాడు. త‌న తండ్రి చనిపోతే కనీసం సమాచారం ఇవ్వరా అని అతడు నిలదీస్తున్నాడు. డెత్ స‌ర్టిఫికెట్ కూడా ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశాడు. అయితే.. ఈ ఆరోప‌ణ‌ల‌పై స్పందించడానికి ఆస్పత్రి యాజ‌మాన్యం నిరాక‌రించింది.

Related Posts