YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం విదేశీయం

భారత్ కు వచ్చిన మరో 2 ఫ్లైట్లు

భారత్ కు వచ్చిన మరో 2 ఫ్లైట్లు

భారత్ కు వచ్చిన మరో 2 ఫ్లైట్లు
హైద్రాబాద్, మే 14,
వందే భారత్’ మిషన్‌లో భాగంగా విదేశాలలో చిక్కుకుపోయిన భారతీయులను తిరిగి స్వదేశానికి తీసుకువచ్చే అతి పెద్ద తరలింపు ప్రక్రియ కొనసాగుతోంది. దీనిలో భాగంగా గురువారం తెల్లవారుజామున మనీలా నుంచి ఢిల్లీ మీదుగా ఒక విమానం హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగింది. ఈ AI 1612 విమానం తెల్లవారుజామున 1.58 గంటల సమయంలో 149 మంది భారతీయులతో హైదరాబాద్‌కు వచ్చింది. వాషింగ్టన్ నుంచి ఢిల్లీ మీదుగా వచ్చిన మరో విమానం AI 104 ఉదయం 8.22 గంటల సమయంలో హైదరాబాద్‌కు చేరుకుంది. అమెరికాలో చిక్కుకుపోయిన 163 మంది భారతీయులు స్వదేశం చేరుకున్నారు. ఈ ప్రయాణికులందరినీ పూర్తిగా శానిటైజ్ చేసిన విమానాశ్రయం గుండా బైటికి తీసుకువచ్చారు.ఇతర దేశాల నుంచి వచ్చిన భారతీయుల కోసం విమానాశ్రయంలో ఎయిరో బ్రిడ్జి నుంచి అరైవల్స్ ర్యాంప్ వరకు పూర్తిగా శానిటైజ్, ఫ్యూమిగేషన్ చేశారు. దాంతో పాటు విమానాశ్రయంలోని వాష్ రూంలు, కుర్చీలు, కౌంటర్లు, ట్రాలీలు, రెయిలింగులు, లిఫ్టులు, ఎస్కలేటర్లు మొదలైన వాటిని కూడా శానిజైట్ చేశారు. విమానాశ్రయంలోకి 20-25 మంది ప్రయాణికులను ఒక బృందంగా చేసి తీసుకువచ్చారు. ఇమిగ్రేషన్ నిబంధనలను పూర్తి చేయడానికి ముందు ఎయిర్‌ పోర్ట్ హెల్త్ అధికారులు, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మార్గదర్శాకల ప్రకారం ప్రతి ప్రయాణికుడికి థర్మల్ కెమెరాల ద్వారా స్క్రీనింగ్ నిర్వహించారు.పూర్తిగా శానిటైజ్ చేసిన బ్యాగేజ్ ట్రాలీలను ప్రయాణికుల కోసం సిద్ధంగా ఉంచారు. కస్టమ్స్ క్లియరెన్స్ పూర్తయి, టెర్మినల్ బిల్డింగ్ నుంచి బయటికి వెళ్లడానికి ముందు, ప్రయాణికులకు కాంప్లిమెంటరీ ఆహార పొట్లాలను అందించారు. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ప్రయాణికులను నగరంలో ముందుగా గుర్తించిన ప్రదేశాలకు 14 రోజుల తప్పనిసరి క్వారంటైన్‌కు తరలించారు. ప్రయాణికులు వెళ్లిన అనంతరం ఎయిర్‌పోర్ట్‌ను మరొకసారి పూర్తిగా శానిటైజ్, ఫ్యూమిగేట్, డిస్‌ఇన్ఫెక్ట్ చేశారు. ‘వందే భారత్’లో భాగంగా మరో విమానంలో రాబోయే ప్రయాణికుల కోసం ఎయిర్ పోర్టును సిద్ధం చేశారు.

Related Posts