YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

మృతదేహాలకూ కరోనా పరీక్షలు చేయాల్సిందే.. హైకోర్టు ఆదేశాలు

మృతదేహాలకూ కరోనా పరీక్షలు చేయాల్సిందే.. హైకోర్టు ఆదేశాలు

మృతదేహాలకూ కరోనా పరీక్షలు చేయాల్సిందే.. హైకోర్టు ఆదేశాలు
హైద్రాబాద్ , మే 14
కొవిడ్ ఆస్పత్రుల్లో చనిపోయిన వారికి కూడా కరోనా టెస్టులు చేయాలని హైకోర్టు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. మరణించిన వారికి కరోనా పరీక్షలు చేయాల్సిన అవసరం లేదని గతంలో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో హైకోర్టు తాజాగా ఉత్తర్వులు జారీ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. మృతదేహాలకు కరోనా టెస్టులు అవసరం లేదన్న ఉత్తర్వులను సవాలు చేస్తూ ప్రొఫెసర్ విశ్వేశ్వర రావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అనారోగ్యంతో చనిపోయిన వారి మృతదేహాలకు కూడా కరోనా పరీక్షలు చేయకపోతే వ్యాధి వ్యాప్తి మూడో స్థాయికి చేరుకునే అవకాశాలు ఉన్నాయని న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ వాదనలు వినిపించారు.అంతేకాక, ఇందుకు ఉదాహరణలు కూడా ఆయన కోర్టు ముందు ఉంచారు. నెల్లూరు, కర్నూలులో అనారోగ్యంతో చనిపోయిన తర్వాత పరీక్షలు నిర్వహించగా వారికి కరోనా ఉన్నట్లు తేలిందని పిటిషనర్ కోర్టుకు తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన నివేదికపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన ధర్మాసనం.. ప్రపంచ ఆరోగ్య సంస్థతో పాటు వివిధ సంస్థలు ఇచ్చిన మార్గదర్శకాలను పాటించాలని ఆదేశాలు జారీ చేసింది. అంతేకాక, కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిబంధనలు అనుసరిస్తోందో నివేదిక సమర్పించాలని కూడా ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ అంశంపై ఈ నెల 26 నాటికి మరో స్పష్టమైన నివేదిక సమర్పించాలని హైకోర్టు నిర్దేశిస్తూ తదుపరి విచారణను అదే రోజుకు వాయిదా వేసింది

Related Posts