బిజెపి ఆధ్వర్యంలో ప్రధానికి పాలాభిషేకం
మందమర్రి మే 14
కరోనా మహమ్మారిని అరి కట్టడానికి దేశ వ్యాప్తంగా విధించిన లాక్ డౌన్ లో అన్ని వర్గాల 80 శాతం పేద మధ్యతరగతి ప్రజలు ,చిరు వ్యాపారులు, చిన్న మధ్యతరహా పరిశ్రమలను,రైతులను ఆదుకోవడానికి భారత ప్రధాని నరేంద్ర మోడీ 20 లక్షల కోట్ల రూపాయలు ప్యాకేజీ దేశ ప్రజలకు ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ భారతీయ జనతా పార్టీ చెన్నూర్ నియోజకవర్గం నాయకులు డి వి దీక్షితులు , ఆరుముళ్ళ పోశం , మద్ధి శంకర్, పైడిమల్ల నర్సింగ్ రామ్టెంకి దుర్గరాజు లతోపటు బి ఎం ఎస్ నాయకులు ఏడుకోల పవన్ కుమార్ లు గురువారం ప్రధాని నరేంద్ర మోదీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమం లో వంజరి వెంకటేష్ , మార్త కుమార్ , పోతులూరి రాజేందర్ , మోతపెళ్లి బద్రి , ఎండి పాషా , సుద్దాల రాజ్ కుమార్, తెలుసూరి శ్రీనివాస్, అడిగొప్పుల మురళి, ముర్మురి రమేష్ , నీరటి వెంకటేష్ , ఎండి కలిల్ , జంగం మధు , మాటేటి కృష్ణ , పూప్పల నరేందర్,కాంపెల్లి సుధాకర్, చిప్పకుర్తి శశిధర్ లు పాల్గొన్నారు.