YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విదేశీయం

కరోనా మరణాల్లో అమెరికా మూడో వంతు..

కరోనా మరణాల్లో అమెరికా మూడో వంతు..

కరోనా మరణాల్లో అమెరికా మూడో వంతు..
న్యూయార్క్, మే 15,
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. ఈ మహమ్మారి బారినపడి ప్రాణాలు కోల్పోయినవారి సంఖ్య మూడు లక్షలు దాటింది. మొత్తం 303,361 మరణాలు సంభవించగా.. ఒక్క అమెరికాలోనే 86,912 మంది మృత్యువాతపడ్డారు. మొత్తం కరోనా బాధితుల సంఖ్య 45.25 లక్షలకు చేరగా.. వీరిలో 17 లక్షల మంది కోలుకున్నారు. దాదాపు 25 లక్షల మంది ఇంకా చికిత్స పొందుతుండగా.. వీరిలో 45,560 మంది పరిస్థితి విషమంగా ఉంది. అమెరికాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 14.57 లక్షలు దాటింది. అమెరికా తర్వాత బ్రిటన్‌లో అత్యధిక కరోనా మరణాలు చోటుచేసుకున్నాయి. అక్కడ మొత్తం కరోనా మరణాలు 33వేలు దాటగా.. బాధితుల సంఖ్య 2లక్షల 33వేలు దాటింది.కరోనా వైరస్ కట్టడికి విధించిన లాక్‌డౌన్ కారణంగా ఎదురయిన సంక్షోభంతో కుదేలైన ఆర్థిక వ్యవస్థలను తిరిగి గాడిలో పెట్టేందుకు పలు దేశాలు భారీ ప్యాకేజీలను ప్రకటిస్తున్నాయి. నిరుద్యోగిత రేటును 10 శాతం లోపు ఉంచడమే లక్ష్యంగా భారీగా రుణాలు సమీకరించి ఖర్చు చేయనున్నట్లు న్యూజిలాండ్ ఆర్థిక మంత్రి గ్రాంట్‌ రాబర్ట్‌సన్‌ తెలిపారు. ప్రస్తుతం స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ)లో దాదాపు 20%గా ఉన్న రుణాలు.. 2023 నాటికి 54 శాతానికి పెరిగే అవకాశముందని ాయన పేర్కొన్నారు.రెస్టారెంట్లు, హోటళ్లు, పర్యాటక కేంద్రాలను ఆదుకోవడానికి దాదాపు రూ.1.45 లక్షల కోట్ల ప్యాకేజీని ఫ్రాన్స్‌ ప్రకటించింది. త్వరలో భారీగా పన్ను మినహాయింపులు కల్పిస్తామని, పౌరులు-వ్యాపార సంస్థలను ఆర్థికంగా ఆదుకుంటామని ఇటలీ ప్రధాని హామీ ఇచ్చారు. కొవిడ్‌ సంక్షోభంతో ఈ ఏడాది తొలి త్రైమాసికంలో ప్రపంచ వాణిజ్యం మూడు శాతం మేర కుంచించుకుపోయిందని ఐక్యరాజ్యసమితి వాణిజ్య, అభివృద్ధి సదస్సు(యూఎన్‌సీటీఏడీ) ఓ నివేదికలో వెల్లడించింది.ఫిలిప్పీన్‌ను కరోనా భయపెడుతున్నవేళ దానికి తుఫాను తోడయ్యింది. తుఫాను విరుచుకుపడటంతో తీవ్ర ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. కొండచరియలు విరిగిపడటంతోపాటు వరదల ముప్పు పొంచి ఉండటంతో వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. దీంతో అక్కడ కొవిడ్‌ కేసులు భారీగా పెరిగే ముప్పుందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.కొన్ని ప్రాంతాల్లో ఆత్యయిక స్థితిని ఎత్తివేయాలని జపాన్‌ ప్రధానమంత్రి షింజో అబె నిర్ణయించారు. యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌(యూఏఈ)లో తాజాగా 698 మందికి కోవిడ్‌-19 పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 21 వేలు దాటింది. చైనాలో పాజిటివ్‌గా కేసుల సంఖ్య మరోసారి పెరుగుతోంది. దంతో వుహాన్ నగరంలో అందరికి పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు.ఐరోపాలోని ఇటలీలో 31,368, స్పెయిన్‌లో 27,321, ఫ్రాన్స్‌లో 27,425, బెల్జియంలో 8,903, జర్మనీలో 7,928 మంది కరోనా కాటుకు బలయ్యారు. రష్యాలో మహమ్మారి ఉగ్రరూపం దాల్చింది. మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రెండున్నర లక్షలు దాటేయగా.. మొత్తం 2,305 మంది ప్రాణాలు కోల్పోయారు. బ్రెజిల్‌లోనూ కోవిడ్ స్వైరవిహారం కొనసాగుతోంది. ఇప్పటి వరకూ మహమ్మారి బారినపడి 14 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. స్పెయిన్‌లో 272,024, బ్రిటన్ 233,300, ఇటలీలో 233,973, ఫ్రాన్స్‌లో 178,183, జర్మనీలో 174,975, టర్కీలో 144,779, బెల్జియం 54,979 మంది వైరస్ బారినపడ్డారు. ఇరాన్‌లో కరోనా బాధితుల సంఖ్య 1.14 లక్షలు దాటగా.. 6,854 మంది చనిపోయారు.=

Related Posts