YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

రాజకీయం వాణిజ్యం దేశీయం

అప్పులు చెల్లిస్తే...కొత్త రుణాలు

అప్పులు చెల్లిస్తే...కొత్త రుణాలు

అప్పులు చెల్లిస్తే...కొత్త రుణాలు
న్యూఢిల్లీ, మే 15
కరోనా ప్రభావంతో అతలాకుతలమైన ఆర్దిక రంగానికి ఊతమిచ్చేలా ప్రధాని నరేంద్ర మోడీ రూ.20 లక్షల కోట్ల భారీ ప్యాకేజీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఐదు మూల సూత్రాలతో ఆర్దిక ప్యాకేజ్ ప్రకటించగా. డిస్కంలకు రూ.90 వేల కోట్ల సాయం అందజేయనున్నారు. దీని ద్వారా విద్యుత్ సంస్థలు, వినియోగదారులకు మేలు జరగనుంది. ఈ నేపథ్యంలో కేంద్రం ప్రకటించిన రూ.90వేల కోట్ల రుణాలు పొందాలంటే ఇక మీదట రాష్ట్ర ప్రభుత్వంలోని అన్ని శాఖలు డిస్కంలకు నెలవారీ ముందస్తు చెల్లింపు విధానాన్ని (ప్రీపెయిడ్‌ బిల్లింగ్‌) అవలంబించాల్సి ఉంటుందని కేంద్ర విద్యుత్‌ శాఖ మంత్రి ఆర్‌కే సింగ్‌ స్పష్టం చేశారు.ప్రస్తుత ఉద్దీపన పథకం కింద పదేళ్ల కాలపరిమితితో 8.5 నుంచి 9 శాతం తక్కువ వడ్డీకే పీఎఫ్‌సీ, ఆర్‌ఈసీలు డిస్కంలకు రుణాలిస్తాయని ఆయన తెలిపారు. వీటిపై రెండేళ్ల మారిటోరియం ఉంటుందని స్పష్టం చేశారు. గతంలో ఇవి అందించే రుణాలపై 2.5 నుంచి 3.5 శాతం వరకు రుసుం వసూలు చేసేవని, ఇప్పుడు దాన్ని 1.5%కే పరిమితం చేయాలని చెప్పామని అన్నారు. పీఎఫ్‌సీ, ఆర్‌ఈసీల ద్వారా అందించే రుణాలకు ప్రతిసారీ రాష్ట్ర ప్రభుత్వాలు గ్యారంటీ ఇస్తున్నందున ఇబ్బందులు ఉండవని పేర్కొన్నారువిద్యుత్ రంగాన్ని ఉత్తేజపరిచే ప్రణాళికలో భాగంగా లాక్‌డౌన్ కాలంలో విద్యుత్ కొనుగోలు ఒప్పందం (పీపీఏ) కింద జెన్‌కోలకు స్థిర ఛార్జీల చెల్లింపును కూడా వాయిదా వేయడానికి డిస్కమ్‌లకు అనుమతించామని సింగ్ తెలిపారు. సాధారణంగా యూనిట్‌కు రూ .1.25-1.50 చొప్పున వసూలు చేసే ఈ చెల్లింపులను డిస్కంలు మూడు విడతలుగా లాక్‌డౌన్ అనంతరం చెల్లించవచ్చని, వీటిపై ఎలాంటి వడ్డీ, అదనపు ఛార్జీలను వసూలు చేయబోమని ఉద్ఘాటించారు.ప్రస్తుతం రూ.90వేల కోట్ల ప్యాకేజీ అందుకోడానికి మేం ప్రతిపాదించిన సంస్కరణలు సరళమైనవేనని, డిస్కంలకు ఇప్పుడున్న అప్పుల్లో రూ.54వేల కోట్లు రాష్ట్ర ప్రభుత్వాల్లోని వివిధ విభాగాల చెల్లించాల్సినవేనని అన్నారు. కాబట్టి ఇకపై ఆయా ప్రభుత్వ విభాగాలు విద్యుత్‌ బిల్లులు ప్రతి నెలా చెల్లించే వ్యవస్థ తీసుకురావాలని రాష్ట్రాలకు చెప్పినట్టు తెలిపారు.ఇకమీదట రాష్ట్రాలు ఏ సబ్సిడీ ప్రకటించినా అవి వెంటనే చెల్లించాలని, మీటరింగ్‌, బిల్లింగ్‌ సామర్థ్యాన్ని పెంచి విద్యుత్ చౌర్యాన్ని తగ్గించాలన్నారు. ఇందులో ఏదీ కఠినమైన షరతు కాదని, విద్యుత్‌ సంస్కరణల్లో భాగంగా రూపొందించిన రివైజ్డ్‌ టారిఫ్‌ పాలసీని మంత్రివర్గ ఉపసంఘం ఆమోదించిందని తెలిపారు. కేబినెట్‌ ఆమోదం తర్వాత ఇది త్వరలో అమల్లోకి వస్తుందని ఆర్‌కే సింగ్‌ వివరించారు.

Related Posts