YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం వాణిజ్యం దేశీయం విదేశీయం

భారత్ కు వరల్డ్ బ్యాంక్ రూ.7500 కోట్ల సాయం

భారత్ కు వరల్డ్ బ్యాంక్ రూ.7500 కోట్ల సాయం

భారత్ కు వరల్డ్ బ్యాంక్ రూ.7500 కోట్ల సాయం
న్యూ డిల్లీ మే 15,
కరోన ప్రతికూల పరిస్థితుల్లో భారత్ కు శుభవార్త అందింది వరల్డ్ బ్యాంక్. ఈ  వైరస్పై పోరుకు ప్రపంచ బ్యాంకు తాజాగా భారత్ కు బిలియన్ డాలర్ల అత్యవసర ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. మన కరెన్సీలో  దాదాపు రూ.7500 కోట్ల సాయం. హెల్త్ సెక్టార్కు సంబంధించి వరల్డ్ బ్యాంక్ నుంచి భారత్కు అందుతున్న అతిపెద్ద ఆర్థిక సాయం ఇదే కావడం గమనార్హం.ఈ మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో  సోషల్ ప్రొటెక్షన్ ప్యాకేజీ కింద రూ. 7500 కోట్ల ప్రకటించింది. దీనివల్ల జనజీవన ప్రమాణాలు చాలా వేగంగా అభివృద్ధి చెందుతాయని వరల్డ్ బ్యాంక్ సోషల్ ప్రొటెక్షన్ గ్లోబల్ డైరెక్టర్ రుట్కోస్కీ తెలిపారు. వరల్డ్ బ్యాంకు విడుదల చేసిన ఈ నిధులని  ఆరోగ్యం సామాజిక రక్షణ చిన్న మధ్య తరహా పరిశ్రమల కో ఖర్చు చేయనున్నట్లు వారు బ్యాంక్ భారత ప్రతినిధి తెలిపారు. ఈ  మహమ్మారి ప్రభావాన్ని ఎదుర్కోవటానికిగాను భారత్ కు ఏప్రిల్ ప్రారంభంలో 1 బిలియన్ డాలర్ల అత్యవసర సహాయాన్ని ప్రపంచ బ్యాంకు ప్రకటించింది.  తాజాగా మరో బిలియన్ డాలర్లు అందివ్వ నుంది. అలాగే  ఎంఎస్ ఎంఈ ల కోసం మూడవ ప్యాకేజీ  కూడా రానుదని భావిస్తున్నారు.  సోషల్ ప్రొటక్షన్ పథకం కింద ఆయా దేశాలకు వరల్డ్ బ్యాంకు నిధులను సమాకూరుస్తున్నసంగతి తెలిసిందే.

Related Posts