YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం వాణిజ్యం ఆంధ్ర ప్రదేశ్

విద్యుత్ ఛార్జీలపై క్లారిటీ ఇచ్చిన మంత్రి బుగ్గన

విద్యుత్  ఛార్జీలపై క్లారిటీ ఇచ్చిన మంత్రి బుగ్గన

విద్యుత్  ఛార్జీలపై క్లారిటీ ఇచ్చిన మంత్రి బుగ్గన
అమరావతి మే 15
 ఆంధ్రప్రదేశ్లో కరెంట్ ఛార్జీలు అధికంగా వస్తున్నాయని గత కొన్ని రోజులుగా వివాదం నడుస్తున్న విషయం తెలిసిందే. దీనిపై ప్రతిపక్షాలు నిరసిస్తూ అధికార పార్టీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించాయి. మరోవైపు కరెంట్ బిల్స్ను జనాలు తీసుకోకుండా పలు ప్రాంతాల్లో ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ఈ మొత్తం వ్యవహారాలపై.. ప్రజల్లో నెలకొన్న అనుమానాలు, ప్రతిపక్షాల విమర్శలపై మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి క్లారిటీ ఇచ్చుకున్నారు.
కరెంటు ఛార్జీలపై దుష్ప్రచారం చేస్తున్నారు. శ్లాబుల ధరలు పెరగకపోయినా పెరిగినట్టు దుష్ప్రచారం చేస్తున్నారు. లాక్డౌన్ వల్ల ప్రజలు ఇళ్లలోనే ఉన్నారు. దీని వల్ల ఆటోమాటిక్గా కరెంట్ వినియోగం పెరుగుతుంది. ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఏసీ, టీవీల వాడకం వల్ల పెరుగుతుంది. మార్చి, ఏప్రిల్ నెలల్లో బిల్లులు ఇవ్వలేదు. ఏ నెలకు ఆ నెల యూనిట్లు విడదీశారు. రెండు నెలల బిల్లులు ఒకేసారి రావడం వల్ల ఎక్కువ కనిపిస్తోంది. ఇప్పుడు ఇస్తున్న బిల్లుల్ని మూడు నెలల సగటు యూనిట్లు లెక్కవేసే ఇస్తున్నాం’ అని మంత్రి బుగ్గన చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా పలువురు వినియోగదారులకు సంబంధించిన బిల్లులను చూపించి  మంత్రి వివరించారు.

Related Posts