YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం వాణిజ్యం ఆంధ్ర ప్రదేశ్

మూడు నెలల కావడంతోనే ఎక్కువ బిల్లు

మూడు నెలల కావడంతోనే ఎక్కువ బిల్లు

మూడు నెలల కావడంతోనే ఎక్కువ బిల్లు
విజయవాడ, మే 15,
రాష్ట్రంలో విద్యుత్ బిల్లులు పెంచారంటూ ప్రతిపక్ష తెలుగు దేశం పార్టీ దుష్ప్రచారం చేస్తోందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. విద్యుల్ శ్లాబుల ధరలు పెరగకపోయినా.. పెరిగినట్లు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రస్తుత లాక్‌ డౌన్‌ వల్ల ప్రజలు ఇళ్లలో ఉండటం వల్లే కరెంట్ వినియోగం పెరిగిందని మంత్రి బుగ్గన అన్నారు.మంత్రి బుగ్గన శుక్రవారం విజయవాడలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. మార్చి, ఏప్రిల్‌ నెలల్లో విద్యుత్ బిల్లులు ఇవ్వలేదని, ఇప్పుడిస్తున్న బిల్లులను మూడు నెలల సగటు యూనిట్లు లెక్కేసి ఇస్తున్నట్లు చెప్పారు. 3 నెలల బిల్లు ఒకేసారి కట్టాల్సి రావడం వల్లే ఎక్కువ బిల్లు వచ్చినట్లు కనిపిస్తోందని వివరించారు. జూన్ 30వ తేదీ వరకు బిల్లులు చెల్లింపునకు ప్రభుత్వం అవకాశం ఇస్తే.. 15 వరకు అంటూ కొన్ని పత్రికల్లో తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.ఏప్రిల్ నెల నుంచి రాష్ట్రంలో కొత్త టారిఫ్ అమలులోకి వచ్చిందని.. మార్చి, ఏప్రిల్ నెలల్లో లాక్‌డౌన్ నేపథ్యంలో ప్రజలు ఇళ్లలోనే ఉండటంతో విద్యుత్ బిల్లులు పెరిగాయని మంత్రి బుగ్గన పేర్కొన్నారు. అలాగే సోషల్ మీడియాలో విద్యుత్ బిల్లులపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. మీటర్ రీడింగ్ రెండు నెలలు తీయక పోవడంతోనే టారిఫ్ శ్లాబ్ మారడంతో కరెంట్ బిల్లులు పెరిగాయని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో 200 యూనిట్లు లోపు విద్యుత్ వాడితే దేశంలో తక్కువగా బిల్లు వస్తోందన్నారు. పవర్ పర్చేజ్‌ బకాయిలు 2014లో రూ. 4,900 కోట్లు ఉంటే.. 2019 నాటికి రూ. 20 వేల కోట్లకు చేర్చారని ఆరోపించారు.2014లో యూనిట్ 4.33 పైసలకు కొనుగోలు చేస్తే టీడీపీ హయాంలో యూనిట్ 6 రూపాయిలకు పెంచిందని మంత్రి బుగ్గన చెప్పారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికరంలోకి రాగానే 5.16 పైసలుకు యూనిట్ తగ్గించామని తెలిపారు. జెన్‌కోకు టీడీపీ హయాంలో రూ. 11 వేల కోట్లు బకాయిలు ఉంటే తాము అధికారంలోకి రాగానే రూ. 7 వేల కోట్లు చెల్లించినట్లు చెప్పారు

Related Posts