YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

రోడ్డు ప్రమాదంలో 24 మంది వలస కూలీల దుర్మరణం

రోడ్డు ప్రమాదంలో 24 మంది వలస కూలీల దుర్మరణం

రోడ్డు ప్రమాదంలో 24 మంది వలస కూలీల దుర్మరణం
లక్నో మే 16,
ఉత్తర్ప్రదేశ్ లోని ఔరయ వద్ద శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వస్తున్నరెండు ట్రక్కులు ఢీకొన్న ఘటనలో 24 మంది మృతి చెందగా, 22  మందికి తీవ్ర గాయాలయ్యాయి. ట్రక్కులో రాజస్థాన్ నుంచి  వలస కూలీలతో ఉత్తరప్రదేశ్ కు వస్తోంది. ఎదురుగా ఢిల్లీనుంచి వస్తున్న వాహనం ఢీకొనడంతో మిహౌలీ దగ్గర ఈ ఘటన జరిగింది.  . బాధితులు బిహార్, ఝార్ఖండ్, పశ్చిమ్బంగాకు చెందిన వలసకూలీలుగా గుర్తించారు. క్షతగాత్రులను సమీపంలోని సైఫై ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వలస కూలీలను శ్రామిక్ రైళ్లు లేదా ప్రత్యేక బస్సుల ద్వారా మాత్రమే వారి స్వస్థలాలకు తరలించాలని కేంద్ర హోంమంత్రిత్వశాఖ శుక్రవారం  రాత్రి ఆదేశాలు జారీ చేసిన  కొన్ని గంటల సమయంలోనే ఈ ఘటన జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో ఏ ఒక్క వలస కూలీ కూడా నడిచివెళ్లడానికి వీల్లేదని, వారు స్వస్థలాలకు చేరుకునేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది.

Related Posts