YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

నిర్జన గ్రామాల్లో క్వారంటైన్

నిర్జన గ్రామాల్లో క్వారంటైన్

నిర్జన గ్రామాల్లో క్వారంటైన్
డెహ్రాడూన్, మే 16
కరోనా కట్టడి కోసం విధించిన లాక్‌డౌన్‌‌తో దేశంలోని పలు నగరాల్లో చిక్కుకొని ఇబ్బందులు పడ్డ వలస కార్మికులకు కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో భారీ ఊరట కలిగింది. శ్రామిక్ రైళ్ల ఏర్పాటుతో వీరంతా స్వస్థలాలకు తరలివెళ్తున్నారు. అయితే.. ఇలా స్వస్థలాలకు వస్తున్న కార్మికులను క్వారంటైన్ చేయాలని కేంద్రం నిబంధన విధించిన విషయం తెలిసిందే. దీంతో రాష్ట్ర ప్రభుత్వాలు ఇందుకు ఏర్పాట్లు చేస్తున్నాయి. లక్షలాదిగా తరలి వస్తున్న వలస కార్మికులకు క్వారంటైన్‌ ఏర్పాటు చేయడం కొన్ని రాష్ట్రాలకు ఇబ్బందిగా మారింది. ఈ క్రమంలో ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం వినూత్న నిర్ణయం తీసుకుంది. పాడుబడిన ‘దెయ్యాల గ్రామాల’ను క్వారంటైన్ కేంద్రాలుగా మారుస్తోంది. ఈఉత్తరాఖండ్‌లోని పౌడి జిల్లాలోని చాలా గ్రామాల్లో సరైన వసతులు లేక చాలా మంది ఇళ్లను ఖాళీ చేసి పట్టణాలకు వెళ్లిపోయారు. మౌలిక వసతులు, ఉద్యోగ అవకాశాలు లేకపోవడంతో స్థానికులు వలస వెళ్లడంతో ఏళ్ల తరబడి ఇక్కడ ఇళ్లన్నీ ఖాళీగా మారాయి. ఆయా గ్రామాల్లో ఇళ్లన్నీ తాళం వేసి కనిపిస్తాయి. నిర్జనంగా మారిపోయిన పాడుబడిన ఇళ్లతో కూడిన ఈ గ్రామాలను ‘దెయ్యాల గ్రామాలు’గా పిలుస్తుంటారు. లాక్‌డౌన్‌ కారణంగా కొన్ని దశాబ్దాల తర్వాత గ్రామస్థులు తిరిగి వస్తుండటం గమనార్హంప్రస్తుతం వలస కార్మికులను క్వారంటైన్‌ చేయడానికి ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఈ గృహాలను వినియోగించాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించి చర్యలు ప్రారంభించింది. ‘దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి స్వస్థలాలకు వస్తున్న వారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. అందుకే ఈ నిర్జన గ్రామాల్లోని ఇళ్లను వాడుకోవడం అత్యవసరం’ అని పౌడి జిల్లా అధికారి పేర్కొన్నారు.పౌడి జిల్లాలో అత్యధికంగా 186 నిర్జన గ్రామాలున్నాయి. ఆయా గ్రామాల్లో ఖాళీగా ఉన్న ఇళ్లను శుభ్రం చేయించి సదుపాయాలు కల్పించారు. 576 మందిని క్వారంటైన్‌ చేశారు. సాధారణంగా వలస కార్మికులను క్వారంటైన్‌ చేసేందుకు పాఠశాలలు, గ్రామ పంచాయతీ భవనాలు, ప్రభుత్వ అధీనంలోని ఇతర భవనాలను ఉపయోగిస్తున్నారు. అయితే.. ఇవన్నీ ఊరి మధ్యలో ఉండటంతో అక్కడి ప్రజలకు వైరస్‌ ముప్పు పొంచి ఉంటోంది. గ్రామస్థులు కూడా తీవ్ర అభ్యంతరం చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

Related Posts