YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

నీటిపారుదల రంగాన్ని వైసీపీ భ్రష్టు పట్టించింది

నీటిపారుదల రంగాన్ని వైసీపీ భ్రష్టు పట్టించింది

నీటిపారుదల రంగాన్ని వైసీపీ భ్రష్టు పట్టించింది
గొల్లపూడి మే 16,
నీటిపారుదల రంగాన్ని వైసీపీ భ్రష్టు పట్టించింది.  కమీషన్ల కక్కుర్తితో పోలవరం పనులు ఆపేశారు.  సమగ్ర జల విధానంపై వైసీపీ స్టాండ్ ఏంటని మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వర రావు ప్రశ్నించారు. శనివారం అయన మీడియాతో మాట్లాడారు. టీడీపీ హయాంలో ప్రతి సంవత్సరం కాటన్ జయంతి రోజున చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఇంజనీర్లను సత్కరించుకున్నాం.  కాటన్ జయంతిని గుర్తు చేసుకునే తీరక కూడా లేదు జగన్మోహన్ రెడ్డికి.   నీటిపారుదలశాఖ మంత్రేమో మీసాలు తీసేస్తామని చెబుతున్నారు.   కాటన్, కేఎల్ రావు, విశ్వేశ్వరయ్య  లాంటి వారిని భావితరాలు గుర్తుంచుకుంటారు.   చంద్రబాబు గారి నాయకత్వంలో రూ. 63 వేల కోట్లకు పైగా పనులు చేసి సమగ్ర జలవిధానంతో ఏపీలో వెనుకబడిన ప్రాంతాలకు నీరు అందించామని అన్నారు.  పోలవరంలో 70.82% పనులు జరిగాయని 19.5.2019 న అధికారులు ఇచ్చిన రిపోర్టును ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఇరిగేషన్ మంత్రి చూడాలి.   ఎన్నికలు అనంతరం 26.5.2019న 71.13% పనులు అయినట్టు అధికారులు రిపోర్ట్ ఇచ్చారు. ఇదే అధికారులు ఇప్పుడూ అప్పుడూ ఉన్నారు.   10.6.2019న 71.43 % పనులయ్యాయి. మీ ప్రభుత్వంలో పోలవరం పనులు ఎంత వరకూ జరిగాయో మీ రివ్యూల్లోనే బాగా చూసుకోండి.   ఎవరి మీసాలు ఎవరు తీసుకుంటారో, ఎవరి గడ్డాలు ఎవరు తీసుకుంటారో తేల్చుకోండి.  మాట్లాడేప్పుడు బాధ్యతగా మెలగాలి. ఆనాడు ఇరిగేషన్ మంత్రిగా నేను ప్రతి వారం పోలవరం సమాచారాన్ని ఆన్ లైన్ లో పెట్టి మీడియాకు ఇచ్చాను. మీరు ఎందుకు సమాచారం దాస్తున్నారని ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చి ఏడాదైనా పోలవరం ప్రాజెక్టు పనులు ఎంతవరకు పూర్తయ్యాయో ఎందుకు ఆన్ లైన్ లో పెట్టడం లేదు? ప్రభుత్వం ఎందుకు భయపడుతోంది.   పోలవరం పనులకు సంబంధించి ఎన్నికల ముందు, ఎన్నికల తర్వాత సమాచారాన్ని నేను మీడియా ముందు పెడుతున్నా.    సిగ్గుతో తలవంచుకుంటారా మీరు? నోరు ఉందికదా అని ఇష్టారాజ్యంగా మాట్లాడటం సరికాదు.   ప్రజాస్వామ్యంలో ఉన్నాం. ఐదేళ్లు మీ సాక్షిలో నోటికొచ్చినట్టు రాశారు. ఇవాళ ఏం చేస్తున్నారు మీరు?    పోలవరం ప్రాజెక్టులో ఎంత కాంక్రీటు వేశారు ?ఎంత మట్టి తీశారో చెప్పమంటే సమాధానం చెప్పే దమ్ము లేక మీసాలు తీసుకుందాం రమ్మంటున్నాడు ఇరిగేషన్ మంత్రి.  ఏం మాట్లాడుతున్నారు మీరు? రూ. 12,236 కోట్ల బడ్జెట్ పెట్టారు. ఈ 12 నెలల్లో ఎన్ని లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీటు తీశారు? ఎన్ని బొచ్చిల కాంట్రీటు వేశారు.   నెల్లూరు కట్టాం, సంగం కట్టామంటూ కబుర్లు చెబుతున్నారు.   ఓ ఎమ్మెల్యే నీళ్లు అమ్ముకున్నారని ఆరోపణ వచ్చింది కాబట్టే నేను ప్రశ్నించాను. ఆరోపణలు చేసింది అధికార పార్టీ ఎమ్మెల్యే. ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి. వ్యవస్థలను నిర్వీర్యం చేశారు.  రూ. 12, 236 కోట్ల బడ్జెట్ లో  ఎంత ఖర్చు పెట్టారో చెప్పండి. మీ రివర్స్ టెండరింగ్ ఎంతవరకు వచ్చింది .   టీడీపీ హయాంలో సాగునీటి విజయాలపై పూర్తి సమాచారాన్ని నేను చెప్పగలను. సమగ్ర జలవిధానంతో ముందుకెళ్లాం. దేశానికి ఆదర్శంగా నిలిచాం.   19 స్కాచ్ అవార్డు తెచ్చాం. పోలవరం ప్రాజెక్టును దేశ చరిత్రలో పెట్టాం. సాగునీటి రంగంలో గుజరాత్ తర్వాత ఏపీని దేశంలో రెండో స్థానంలో నిలబెట్టాం.   రివర్స్ టెండరింగ్ చేసి రివర్స్ పాలన చేసి  మీరు ఏమి ఉద్దరించారు? గోదావరి-పెన్నా అనుసంధానం టెండర్లు పిలిచాం. పనులు జరుగుతున్నాయి.  11 నెలలుగా మీరు పనులను ఎందుకు పక్కన పెట్టారో చెప్పండి.   వెలిగొండ టెన్నల్ పనులు ఎవరు మొదలుపెట్టించారు? ఎవరు వేగవంతం చేశారు? పోలవరం పనులు ఎందుకు ఆపేశారు? పోలవరం పవర్ ప్రాజెక్టును కోర్టుల్లో ఎందుకు పెట్టారో చెప్పండి? మీ ఘనకార్యాలు చెబితే వింటామని అన్నారు. 24 గంటలు ఆపకుండా కాంక్రీట్ వేయించాం. కోట్ల క్యూబిక్ మీటర్ల మట్టి పనులు మేము చేస్తే మీరేం చేశారు.. పరిగెత్తే ప్రాజెక్టును కమీషన్ల కక్కుర్తితో ఆపేశారు.  రూ. 500 కోట్ల రివర్స్ టెండరింగ్ డ్రామాలు ఆడారు. ఇసుకకే రూ. 500 కోట్ల ఫైల్ నడిపారు.  సమగ్ర జల విధానంపై వైసీపీ స్టాండ్ ఏంటో చెప్పాలి. ధనదాహంతో  రాజశేఖర రెడ్డి ఇరిగేషన్ ప్రాజెక్టులను పక్కనపడేశారు.    మేము రూ. 63 వేల కోట్లకు పైగా పనులు చేస్తే సిగ్గులేకుండా మమ్మల్ని విమర్శిస్తారా? బూతులు మాట్లాడితే సరిపోయిందా.   మీసాలు, గడ్డాలు తీసుకోడానికి మంత్రులయ్యారా.   సీమకు కృష్ణా జలాలు చంద్రబాబు ఇచ్చారో, జగన్ ఇచ్చారో పులివెందుల రైతును అడగండి... దమ్ముగా ధైర్యంగా చెబుతున్నానని అన్నారు.  వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అవుకు టెన్నల్ పనులు ఎందుకు ఆపారు. బిల్లులు ఎందుకు కట్టలేదు. ఎంత చేతులు మారాయి.ఆ  టెన్నల్ కోసం రూ. 3 వేల కోట్లు ఖర్చు పెట్టి పులివెందులకు మేము నీళ్లిచ్చాం. మీకు చేతనైతే నీళ్లు ముందుకు తీసుకెళ్లండి. డబ్బా కబుర్లు చెప్పకండి.  ఉన్నత చదువులు చదివి, 40 ఏళ్ల అనుభవం ఉన్న చంద్రబాబ గారి దగ్గర నేర్చుకుని కాలువ గట్ల మీద తిరిగిన నాకా మీరు చెప్పేది. పట్టిసీమ కట్టాం. పురుషోత్తపట్నం కట్టాం. వంశధార-నాగావళి పనులు మొదలుపెట్టాం. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పనులు మొదలుపెట్టాం. నెల్లూరు సంగం బ్యారేజ్ పనులను పరిగెత్తిచ్చాం. మీరెందుకు ఆపేశారు.  కడప జిల్లాలో మీ మేనమాన, మీ ఎంపీ, మీ మంత్రికి పనులు ఇస్తారా రూ. 63 వేల కోట్ల పనులు చేసి ధైర్యంగా మాట్లాడుతున్నాం.   ఉపాధి హామీ నిధులను సక్రమంగా వినియోగించాం. సీమ జిల్లాల్లో అడగండి మేము ఏం చేశామో చెప్తారు.   వెనుక బడిన అనంతపురానికి కియాను తీసుకొచ్చాం.   చిత్తూరు జిల్లా కుప్పం వరకు నీరు తీసుకెళ్లాం. 7,8 సార్లు కృష్ణాకు వరద వస్తే ఉపయోగించుకోవడం మీకు రాలేదు. కమీషన్ల కక్కుర్తి కోసం ప్రాజెక్టులను ఆపేశారు.   టీడీపీ హయాంలో 62 ప్రాజెక్టులకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చాం.   నదుల అనుసంధానం చేసి పట్టిసీమ ద్వారా నీరిచ్చి వెలిగొండ పనులు పరుగులు పెట్టించాం.   నీ తండ్రి రాజశేఖర రెడ్డి హయాంలో జరిగిన పాపాలన్నీ కడిగాం.    ప్రాజెక్టులను వైసీపీ భ్రష్టుపట్టించింది. మీ ఇష్టారాజ్యంగా రాష్ట్రంలో నీటిపారుదల రంగాన్ని నాశనం చేశారు.  టీడీపీ హయాంలో ఏపీకి 19 స్కాచ్ అవార్డులు 670కి పైగా అవార్డులు, 2 గిన్నీస్ బుక్, 1 లిమ్కా అవార్డులు వచ్చాయి.   టీడీపీ హయాంలో జరిగిన అభివృద్దిని జీర్ణించుకోలేక ఎదురుదాడి చేస్తున్నారు.   సమగ్ర జలవిధానంతో వెనకబడిన ప్రాంతాలకు నీరు తీసుకెళ్లాం.   వేదావతి, గుండ్రేవుల పనులు ఆపాల్సిన అవసరం ఎందుకొచ్చిందో వైసీపీ సమాధానం చెప్పాలని దేవినేని డిమాండ్ చేసారు.

Related Posts