మహారాష్ట్ర పోలీసు శాఖలో 1140 మందికి కరోనా
ముంబై మే 16
మహారాష్ట్ర పోలీసు శాఖలో గడచిన 24 గంటల్లో 79 మందికి కరోనా వైరస్ సోకింది. దీంతో ముంబై నగరంతో సహా రాష్ట్రం మొత్తం ఒక్క పోలీసుశాఖలోనే1140 మందికి కరోనా వచ్చింది. 120 మంది పోలీసు అధికారులు, 1020 మంది పోలీసు కానిస్టేబుళ్లకు కరోనా సోకడంతో కలకలం రేగింది. దేశ ఆర్థిక రాజధాని నగరమైన ముంబైలో పోలీసుశాఖలో అధిక కరోనా కేసులు నమోదైనాయి. దీంతో పోలీసు ఉన్నతాధికారులు 55 ఏళ్ల కంటే ఎక్కువ వయసు ఉన్న పోలీసులను ఇంటి వద్దనే ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. పోలీసుస్టేషన్లను శానిటైజ్ చేయడంతోపాటు వారి బంధువులను హోంక్వారంటైన్ చేశారు.