ఏపీ ప్రభుత్వం జిఓ 203 జీవోపై కేంద్రం కీలక నిర్ణయం: బండి సంజయ్
హైదరాబాద్ మే 16
ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన 203 జీవోపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన 203 జీవోపై కేంద్రం కీలక నిర్ణయం బండి సంజయ్ స్వయంగా వెల్లడించారు. ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన జివో నెంబర్ 203 పైన తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షేకావత్కు లేఖ రాశామన్నారు.ఆయన తక్షణమే స్పందించి త్వరలోనే అఫెక్స్ కమిటీ సమావేశం ఏర్పాటు చేయాలని కేఆర్ఎంబీని ఆదేశించారని బండి సంజయ్ వెల్లడించారు. ఇది తెలంగాణ బీజేపీ శాఖ చేసిన ప్రయత్నానికి ఫలితంగా భావిస్తున్నామన్నారు. పోతిరెడ్డిపాడు నీటి సామర్ధ్యం పెంపు విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణకు అన్యాయం చేసేలా కుట్రలు పన్నుతోందన్నారు. దీన్ని భారతీయ జనతాపార్టీ తెలంగాణ శాఖ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణకు అన్యాయం చేస్తే సహించేది లేదని బండి సంజయ్ తెలిపారు.