ఇంటికే పరిమితమైన చంద్రబాబు
నగరి మే 16
కరోనా వైరస్ విజృంభిస్తున్న ఈ విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు సాయం చేయకుండా చంద్రబాబు నాయుడు ఇంటికే పరిమితమయ్యారని వైఎస్సార్పీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా విమర్శించారు. ప్రజలు కష్టాల్లో ఉంటే అండగా ఉండకపోవడమే కాకుండా.. సేవ చేసే ధృక్పథంతో నిరంతరం ప్రజల మధ్యలో ఉంటున్న తన లాంటి ఎమ్మెల్యేలపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.కరోనా కట్టడి కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలను ప్రజలు హర్షిస్తున్నారని తెలిపారు.ఎల్జీపాలిమర్స్ ఘటన విషయంలో టిడిపి ఎందుకు వెనకడుగు వేస్తోందని నిలదీశారు.భాదితులకు పరిహారం విషయంలో జగన్ నేరుగా సమీక్షించి భాదితులకు న్యాయం చేస్తున్నారని అన్నారు.కమిటీ పేరుతో సభ్యుల బృందాన్ని ఏర్పాటు చేసి కాలక్షేపం చేస్తున్నారని దుయ్యబట్టారు.