YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం తెలంగాణ

బస్సులకు రైట్...రైట్

బస్సులకు రైట్...రైట్

బస్సులకు రైట్...రైట్
హైద్రాబాద్, మే 18,
తెలంగాణ కేబినెట్ సమావేశానికి ముందు ఆర్టీసీ అధికారులతో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ సమీక్ష నిర్వహించారు. మంగళవారం నుంచి బస్సులు నడపాలని తెలంగాణ ఆర్టీసీ భావిస్తోన్న నేపథ్యంలో.. వైరస్‌ కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై పువ్వాడ సమీక్ష నిర్వహించారు. సాయంత్రం జరిగే కేబినెట్ భేటీలో ఆర్టీసీ సర్వీసులపై కేబినెట్‌కు మంత్రి నివేదిక ఇవ్వనున్నారు. దీని ఆధారంగా ఆర్టీసీ బస్సులను నడిపే విషయమై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది.ఆర్టీసీ బస్సులు నడపడానికి తెలంగాణ సర్కారు సుముఖంగా ఉందని తెలుస్తోంది. మంగళవారం నుంచి గ్రీన్, ఆరెంజ్ జోన్లలో బస్సులు తిరిగేలా అధికారులు ప్రణాళికలు రూపొందించారు. బస్సుల్లో 50 శాతం సీటింగ్ సామర్థ్యం వరకే ప్రయాణికులు ఎక్కడానికి అనుమతిస్తారు. శానిటైజర్లు వాడటంతోపాటు.. బస్సులను ఎప్పటికప్పుడు శానిటైజ్ చేయనున్నారు. బస్సు ఎక్కే వారు కచ్చితంగా మాస్కులు వాడాలనే నిబంధన విధించనున్నారు. సీటింగ్ కెపాసిటీలో 50 శాతం మంది మాత్రమే ప్రయాణించనుండటంతో... బస్సులు ఛార్జీలు కూడా పెరిగే అవకాశం ఉంది. వేరే రాష్ట్రాలకు బస్సు సర్వీసులను నడపకపోవచ్చని సమాచారం.హైదరాబాద్ శివార్ల వరకు ఆర్టీసీ బస్సులు నడిచే అవకాశం ఉంది. నల్గొండ, ఖమ్మం జిల్లాల నుంచి వచ్చే బస్సులను ఎల్‌బీ నగర్ వరకు, వరంగల్ వైపు నుంచి వచ్చే బస్సులను ఉప్పల్ వరకు, కరీంనగర్ వైపు నుంచి వచ్చే బస్సులను జూబ్లీ బస్ స్టేషన్ వరకు అనుమతిస్తారు. ఎంజీబీఎస్ వరకు బస్సులను అనుమతిస్తే.. ప్రయాణికుల రద్దీగా వైరస్ వ్యాపిస్తుందనే అనుమానంతో ఈ నిర్ణయం తీసుకున్నారు

Related Posts