YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

క్వారంటైన్ సెంటర్ లో అధ్వాన్న భోజనమా : చంద్రబాబు

క్వారంటైన్ సెంటర్ లో అధ్వాన్న భోజనమా : చంద్రబాబు

క్వారంటైన్ సెంటర్ లో అధ్వాన్న భోజనమా : చంద్రబాబు
హైద్రాబాద్, మే 18,
జగన్ సర్కార్ తీరుపై మండిపడ్డారు టీడీపీ అధినేత చంద్రబాబు. క్వారంటైన్ సెంటర్‌లో ఉండేవారికి అందించే భోజనం విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని.. కనీసం మంచి ఫుడ్ అందించ లేకపోతున్నారని ఆరోపించారు. శ్రీకాకుళం జిల్లాలోని క్వారంటైన్‌ సెంటర్‌లో ఈ ఘటన జరిగిందని చంద్రబాబు ఓ వీడియోను ట్వీట్ చేశారు. సెంటర్‌లో ఉన్నవాళ్లు భోజనం బాగోలేదంటూ ఆరోపించారు. ఈ వీడియో సోషల్ మీడియాలోనూ వైరల్‌గా మారింది.క్వారంటైన్ సెంటర్లలో ఉంటున్నవారికి మంచి ఆహారం అందించడం ప్రభుత్వానికి కనీస బాధ్యత అన్నారు చంద్రబాబు. శ్రీకాకుళం జిల్లాలోని సెంటర్లలో మత్స్యకారులు, వలస కూలీలు.. అక్కడ ప్రభుత్వం అందిస్తున్న ఆహారం సరిగా లేదని నిరసన తెలియజేశారన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి ఘటనలు చాలా జరిగాయన్నారు టీడీపీ అధినేత. శ్రీకాకుళం జిల్లాలోనే ఓ క్వారంటైన్ సెటర్‌లో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Related Posts