YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

సూపర్ సైక్లోన్ గా ఎంఫాన్

సూపర్ సైక్లోన్ గా ఎంఫాన్

సూపర్ సైక్లోన్ గా ఎంఫాన్
విశాఖపట్టణం, మే 18
బంగాళాఖాతంలో ఏర్పడిన అంఫన్ పెను తుఫానుగా మారిందని, సోమవారం సాయంత్రానికి ఇది సూపర్ సైక్లోన్‌గా మారుతుందని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీచేసింది. ప్రస్తుతం గంటకు 13 కిలోమీటర్ల వేగంతో ఉత్తర దిశగా ముందుకు సాగుతోందని తెలిపింది. ప్రస్తుతం తుఫాను ఒడిశాలోని పారదీప్‌కు దక్షిణంగా 790 కిలోమీటర్లు, పశ్చిమ్ బెంగాల్‌లోని దిఘాకు నైరుతిగా 940 కిలోమీటర్లు, బంగ్లాదేశ్‌లోని ఖేరపుపురాకు వాయువ్యంగా 1,060 కిలోమీటర్ల దూరంలో తుఫాను కేంద్రీకృతమై ఉందని ఐఎండీ తెలిపింది.వచ్చే 8 గంటల్లో సూపర్ సైక్లోన్‌గా మారి ఉత్తర ఈశాన్య దిశగా ప్రయాణించి పశ్చిమ్ బెంగాల్- బంగ్లాదేశ్ మధ్య దిఘా.. హటియా దీవుల వద్ద మే 20 మధ్యాహ్నం లేదా సాయంత్రానికి తీరం దాటే అవకాశం ఉందని అంచనా వేసింది. తీరం దాటే సమయంలో పెను తుఫానుగా ఉంటుందని పేర్కొంది. తర్వాత మే 21 తుఫానుగా.. తదుపరి వాయుగుండంగా మారుతుందని పేర్కొంది. తీరం దాటే సమయంలో గంటలకు 155 నుంచి 165 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని ఐఎండీ హెచ్చరించింది.సోమవారం సాయంత్రం సూపర్ సైక్లోన్‌గా మారడంతో గంటకు 200 నుంచి 265 కిలోమీటర్ల వేగంతో ప్రచండ గాలులు వీస్తాయని హెచ్చరించింది. తుఫాను ప్రభావంతో ఒడిశాలోని జగత్సింగ్‌పూర్, కేంద్రపడ, భద్రక్, బాలాసోర్ జిల్లాల్లో మే 19, 20న అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. సోమవారం సాయంత్రం నుంచి గజపతి, గంజాం, పూరీ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ నేపథ్యంలో ఒడిశా, పశ్చిమ్ బెంగాల్ రాష్ట్రాలను కేంద్రం అప్రమత్తం చేసింది. తీర ప్రాంతాల్లోని 11 లక్షల మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించింది.తుఫాను గాలులకు పూరి గుడిసెలు, మట్టితో నిర్మించిన ఇళ్లు కూలిపోయే ప్రమాదం ఉందని, అలాంటి వారిని ముందుస్తుగా సహాయపునరావాస కేంద్రాలకు తరలించాలని తెలిపింది. వాయువ్య దిశగా ప్రయాణిస్తూ మే20న ఒడిశా, పశ్చిమ్ బెంగాల్ మధ్య తీరాన్ని తాకుతుందని ఐఎండీ వివరించింది. తుఫాను ప్రభావంతో సోమవారం సాయంత్రం నుంచి గంటకు 200 కిలోమీటర్ల వేగంతో ప్రఛండ గాలులు వీస్తాయి.

Related Posts