YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

ప్రాంతీయ పార్టీలు..అజ్ఞాత విరాళాలు

ప్రాంతీయ పార్టీలు..అజ్ఞాత విరాళాలు

ప్రాంతీయ పార్టీలు..అజ్ఞాత విరాళాలు
హైద్రాబాద్, మే 19,
ఏపీలో పార్టీలకు అజ్ఞాత విరాళాల వెల్లువ వచ్చి పడింది. 2018-2019 మధ్యం పార్టీలకు విరాళాలు భారీగా వచ్చాయి. ప్రాంతీయ పార్టీల ఆదాయ మార్గాలకు సంబంధించి అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రీఫార్మ్స్ (ఏడీఆర్), నేషనల్ ఎలక్షన్ వాచ్ జరిపిన అధ్యయనంలో ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. 2018-2019లో అన్ని ప్రాంతీయ పార్టీలకు కలిపి 885.956 కోట్ల విరాళాలు రాగా.. వీటిలో సగం అజ్ఞాత విరాళాలే ఉన్నాయని తేలింది.గుర్తు తెలియని విరాళాలు అందుతున్న ప్రాంతీయ పార్టీల్లో బిజూ జనతా దళ్ (213 కోట్లు) మొదటి స్థానంలో ఉంటే.. రెండో స్థానంలో వైఎస్సార్‌సీపీ ఉంది. టీడీపీ మాత్రం రూ.37.7 కోట్లతో ఐదో స్థానంలో నిలిచింది. 2018-19లో వైఎస్సార్‌సీపీకి మొత్తం రూ.181 కోట్లలో రూ.100 కోట్లు అజ్ఞాత విరాళాలే.. టీడీపీకి మొత్తం రూ.114 కోట్లు వస్తే.. వాటిలో 37.7 కోట్లు అజ్ఞాత విరాళాలు. రెండు పార్టీలకు 46శాతం విరాళాలు గుర్తు తెలియని వ్యక్తులు ఇచ్చినవే.రాజకీయ పార్టీలు తమ ఆదాయ వివరాలను ఎన్నికల సంఘానికి సమర్పించాల్సి ఉంటుంది. పార్టీలకు వచ్చిన విరాళాలు.. ఎలా వచ్చాయో చెప్పాలి. నిబంధనల ప్రకారం రూ.20లోపు విరాళాలు ఇచ్చిన వారు పేర్లు చెప్పనవసరం లేదు. అందుకే పార్టీలు తమకు విరాళాలు ఇచ్చిన వారి వివరాలను ప్రకటించడం లేదు. విరాళాలకు సంబంధించిన సమాచారం లేకుండానే ఎన్నికల సంఘానికి నివేదికలు సమర్పిస్తున్నాయి.2018-19లో ఒడిశాలో అధికారంలో ఉన్న బీజేడీ 249కోట్లు విరాళాల రూపంలో వచ్చాయి.. వీటిలో రూ.213కోట్లు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వచ్చినవే. మిగిలిన జాతీయ పార్టీలు.. అజ్ఞాత విరాళాల వివరాలు ఇలా ఉన్నాయి.
1) బీజేడీ - రూ.213.5 కోట్లు
2) వైఎస్సార్‌సీపీ - రూ.100 కోట్లు
3) శివసేన - రూ.60.7 కోట్లు
4) జేడీఎస్ - రూ.39.1 కోట్లు
5)టీడీపీ - రూ.37.7 కోట్లు
6) జేడీయూ - రూ.8.6 కోట్లు
7) ఎన్డీపీపీ - రూ.6.2 కోట్లు
8) డీఎంకే - రూ.6 కోట్లు
9) ఆప్ - రూ.4.57 కోట్లు
10) జేవీఎం-పీ రూ.1.134 కోట్లు

Related Posts