YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం తెలంగాణ

మిర్యాలగూడ డిపోలో కదిలిన బస్సులు

మిర్యాలగూడ డిపోలో కదిలిన బస్సులు

మిర్యాలగూడ డిపోలో కదిలిన బస్సులు
మిర్యాలగూడ మే 19,
కరోనా వైరస్ కారణంగా గత 55 రోజులుగా ఆర్టీసీ పూర్తిగా లాక్ డౌన్ లోకి వెళ్లిపోవడంతో రవాణా పూర్తిగా స్తంభించిపోయింది... అధికారికంగా నిన్న రాత్రి ప్రకటనతో ఎట్టకేలకు ఆర్టిసి బస్సులు రోడ్డు ఎక్కాయి ఈ నేపథ్యంలో నల్లగొండ జిల్లా మిర్యాలగూడ డిపో నుండి పలు ప్రాంతాలకు బస్సు సర్వీసులు ప్రారంభమయ్యాయి. దీనికి సంబంధించి ముందుగానే బస్సులు అన్నింటినీ సానిటేషన్ చేసిన తర్వాతే ప్రయాణికులు ఎక్కేందుకు అధికారులు అనుమతించారు.  . ప్రతి ఒక్కరు విధిగా మాస్కులు ధరించాలని భౌతిక దూరం పాటించాలని ప్రయాణికులకు సూచిస్తున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా కొవిడ్ 19 నిబంధనలు  పాటించాలని అధికారులు కోరారు.

Related Posts