ప్రశ్నిస్తే కేసులా
విజయవాడ మే 19,
వైసీపీ సర్కార్ పై టీడీపీ మహిళా నేత పంచుమర్తి అనురాధ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ‘‘జగన్ ప్రభుత్వం.. సోషల్ మీడియాను చూస్తే ఎందుకు భయపడుతోంది?, ఫేస్బుక్లో పోస్ట్ షేర్ చేస్తే 60 ఏళ్ల మహిళను వేధిస్తారా?, 60 ఏళ్లు దాటిన మహిళలను కేసుల పేరుతో వేధిస్తున్నారు. ప్రజలను, వృద్ధులను వేధించడానికి సీఐడీ పోలీసులును వాడుతూ.. సీఎం జగన్ వ్యవస్థలను దిగజారుస్తున్నారు. అనాథ శరణాలయాలను నిర్వహిస్తూ.. సమాజ సేవ చేస్తున్న 60 ఏళ్ల మహిళను వేధిస్తున్నారని ఆమె అన్నారు. 12 మంది ప్రాణాలు తీసిన ఎల్జీ పాలిమర్స్ కంపెనీకి సర్టిఫికెట్ ఇస్తారా?, గ్యాస్ లీక్ ఘటనలో పాపను కోల్పోయిన తల్లి ప్రశ్నిస్తే కేసు పెడతారా?, ప్రభుత్వ తప్పులను ఎత్తిచూపితే కేసులు పెట్టి వేధిస్తారా?’’ అంటూ పంచుమర్తి మండిపడ్డారు.