YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

ఇంటివద్దే ప్రార్థనలు జరుపుకోవాలి

ఇంటివద్దే ప్రార్థనలు జరుపుకోవాలి

ఇంటివద్దే ప్రార్థనలు జరుపుకోవాలి
ఇస్లామిక్ మతసంస్థ దారుల్ ఉలూమ్ దేవబంద్ ఫత్వా జారీ
లక్నో మే 19
: ముస్లింలు ఈద్ సందర్భంగా మసీదుల్లో గుమగూడకుండా ఇంటివద్దే ప్రార్థనలు జరుపుకోవాలని ఇస్లామిక్ మతసంస్థ దారుల్ ఉలూమ్ దేవబంద్ ఫత్వా జారీచేసింది. కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందిుకు దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమల్లో ఉన్న కారణంగా ఈ మతపరమైన ఆదేశాలు జారీచేయాల్సి వచ్చింది. కొన్ని సడలింపులు ఇచ్చినప్పటికీ పెద్దఎత్తున జనం గుమిగూడే అవకాశమున్న మతపరమైన కార్యక్రమాలపై నిషేధం కొనసాగుతున్నది. జనం నుంచి వచ్చిన సందేహానికి నివృత్తిగా ఈ ఫత్వా జారీచేసినట్టు దేవబంద్ ప్రతినిధి అష్రాఫ్ ఉస్మానీ తెలిపారు. ప్రస్తుతం శుక్రవారం ప్రార్థనలు ఇంటిదగ్గర నుంచే చేసినట్టుగా ఈద్ నమాజ్ కూడా ఇంటి దగ్గరే చేసుకోవచ్చని ఫత్వా సూచిస్తున్నది. ముస్లింలు ఈనెల 24 లేదా 25న ఈద్ జరుపుకునే అవకాశముంది.

Related Posts