YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

డాక్టర్ సుధాకర్ ను పరామర్శించిన టీడీపీ నేతలు

 డాక్టర్ సుధాకర్ ను పరామర్శించిన టీడీపీ నేతలు
 

 డాక్టర్ సుధాకర్ ను పరామర్శించిన టీడీపీ నేతలు
విశాఖపట్నం మే 19
 విశాఖలో వైద్యుడిపై అధికారుల తీరును తప్పుబడుతున్న టిడిపి,  ప్రభుత్వంపై విమర్శలు సందిస్తోంది.ప్రభుత్వ మానసిక వైద్యశాల లో చికిత్స పొందుతున్న సుధాకర్ ను మాజీ మంత్రి అయ్యన్న, టీడీపీ నాయకులు పరామర్శించారు. ప్రపంచం అంతా డాక్టర్లకు పువ్వులు జల్లుతుంటే మన రాష్ట్రం లో లాఠీలతో కొడుతున్నారని మాజీ మంత్రి అయ్యన్న ఆందోళన వ్యక్తం చేసారు. వైద్యుడి విషయంలో రాజకీయ రంగు పులుముతున్నారని,నర్శింపట్నం ఆసుపత్రి లో సుధాకర్ గత ఎనిమిది సంవత్సరాలు నుంచి వైద్య సేవలు అందిస్తున్నారని, మాస్కు అడిగినందుకు వైద్యుడిపై కక్షసాధింపు చర్యలు తీసుకుంటున్నారని అన్నారు. సస్పెండ్ తో ఆయన మానసిక ఆవేదనకు గురైయ్యారని, డా.సుధాకర్ విషయాన్ని రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్, ఎమ్మెల్సీలు దువ్వరపు రామారావు, జగదీష్, మాజీ ఎమ్మెల్యే అనిత,ఎస్సీ సెల్ జిల్లా అద్యక్షులు విజేయ్ ,నాయులు ప్రణవ్ తదితరులు పాల్గోన్నారు.

Related Posts