కరోనా నియంత్రణలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం
సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క
ఖమ్మం మే 19
కరోనా నియంత్రణ లో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలం చెందిందని సీఎల్పీ లీడర్ మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు. మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇతర ప్రాంతాల నుండి వచ్చిన వారికి ఆ ప్రాంతాల్లోనే ఊరు బయట ప్రత్యేకంగా క్వారంటైన్ ఏర్పాటుచేసి చికిత్స అందించిన అనంతరం గ్రామాల్లో పంపించాలని ఆయన సూచించారు. ఈ విషయాన్ని ప్రభుత్వం పట్టించుకోకపోతే మధిర నియోజకవర్గంలో తన సొంత ఖర్చులతో ప్రత్యేకంగా క్వారంటైన్లో ఉన్న వారికి భోజన సౌకర్యం కల్పిస్తానని తెలిపారు.